అసంపూర్తిగా ఉన్న టాయిలెట్స్
అద్దె ఇంట్లో ఒకే గదిలో ఐదు తరగతుల బోధన
పిల్లర్ల స్థాయిలో నిలిచిన పాఠశాల భవన నిర్మాణ పనులు
అద్దె ఇంట్లో
పాఠశాల
పై ఫొటోలో కనిపిస్తున్నది జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని టాయిలెట్స్. 2022 సంవత్సరంలో మన ఊరు మన బడి కార్యక్రమంలో రూ.5లక్షల నిధులతో టాయిలెట్స్, వంట గది నిర్మాణ పనులు చేపట్టారు. పనులు దాదాపు 80శాతం వరకు పూర్తిచేశారు. టాయిలెట్స్కు నీటి సౌకర్యం కల్పించకపోవడంతో నిరుపయోగంగా మారాయి. ఈ పాఠశాలలో 150మంది విద్యార్థులు, ఎనిమిది మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ప్రస్తుతం పాఠశాలలో నాలుగు టాయిలెట్స్ మాత్రమే ఉన్నాయి. ఇంకా నాలుగు టాయిలెట్స్ అవసరం ఉన్నాయి. వంట గది నిర్మాణం పూర్తికాకపోవడంతో తరగతి గదిలోనే వంట చేస్తున్నారు. ఆరు తరగతులకు నాలుగు గదులు మాత్రమే ఉన్నాయి.
కాటారం: మండలకేంద్రంలోని ఎస్సీ కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల అద్దె ఇంట్లో కొనసాగుతుంది. మన ఊరు–మనబడి కార్యక్రమంలో భాగంగా నూతన భవన నిర్మాణం కోసం 2022 సంవత్సరంలో రూ.7లక్షలు నిధులతో పనులు ప్రారంభించారు. రెండేళ్లుగా నిర్మాణ పనులు నిలిచిపోయి పిల్లర్లకే పరిమితమయ్యాయి. నూతన భవనం మంజూరు కావడంతో శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనాన్ని తొలగించారు. దీంతో అదే ఏడాది తాత్కాలికంగా రెండు గదులున్న పెంకుటిళ్లు అద్దెకు తీసుకొని పాఠశాలను నడిపిస్తున్నారు. ఈ పాఠశాలలో 24మంది విద్యార్థులు ఉండగా ఒకే గదిలో పాఠాలు చెబుతున్నారు.
న్యూస్రీల్
శుక్రవారం శ్రీ 20 శ్రీ జూన్ శ్రీ 2025
శుక్రవారం శ్రీ 20 శ్రీ జూన్ శ్రీ 2025
శుక్రవారం శ్రీ 20 శ్రీ జూన్ శ్రీ 2025
శుక్రవారం శ్రీ 20 శ్రీ జూన్ శ్రీ 2025
శుక్రవారం శ్రీ 20 శ్రీ జూన్ శ్రీ 2025