
రోడ్డు మధ్యలో ‘బోరు’
నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గు అన్న చందంగా మారింది పంచాయతీరాజ్ అధికారులు, కాంట్రాక్టర్ల వ్యవహారం. మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో మే 15నుంచి 26వరకు జరుగు సరస్వతి నది పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరుచేసి పనులు ప్రారంభించింది. త్రివేణి సంగమం వద్ద సరస్వతి ఘాట్ రోడ్డులో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో సీసీ రోడ్డు నిర్మించారు. రోడ్డు మధ్యలో బోరును అలాగే వదిలేశారు. రోడ్డు మధ్యలో అడ్డుగా ఉన్న బోరును చూసినవారంతా నవ్వుకుంటున్నారు. అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో రోడ్డు మధ్యలో బోరును వదిలేశారని విమర్శలు గుప్పిస్తున్నారు. – కాళేశ్వరం