గుణాత్మక విద్యను అందించాలి
జనగామ రూరల్: విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. శనివారం పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనాన్ని ఆయన ప్రారంభించారు. ప్రాంక్లిన్ ట్రాంప్లింగ్ సంస్థ రౌండ్ టేబుల్ ఇండియా సహకారంతో అసంపూర్తి భవనాన్ని పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కార్పొరేట్ సంస్థలు ముందుకు వచ్చి విద్యాభివృద్ధికి తోడ్పడటం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు నాగలక్ష్మి, సునీల్ కుమార్, అసిస్టెంట్ డైరెక్టర్ సత్యమూర్తి, అఖిల్, మాధవ రెడ్డి, కార్తిక్, సహాయ కార్యదర్శి మెరుగు రామరాజు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
కలెక్టర్ రిజ్వాన్ బాషా


