సోమన్న హుండీ ఆదాయం రూ.18లక్షలు
పాలకుర్తి టౌన్ : శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయం హుండీ ఆదాయం రూ.18,04,055లు వ చ్చినట్లు ఆలయ ఈఓ భాగం లక్ష్మీప్రసన్న తెలిపా రు. 2025 అక్టోబర్ 9 నుంచి 2026 జనవరి 1 వరకు భక్తులు హుండీలో సమర్పించిన 85 రోజుల కానుకల ఆదాయన్ని శుక్రవారం ఆలయ కల్యాణ మండపంలో కొడవటూర్ శ్రీసిద్దేశ్వర ఆలయ ఈఓ చిందం వంశీ పర్యవేక్షణలో లెక్కించారు. అమెరికా కరెన్సీ నోట్లు 13 (88 డాలర్లు) వచ్చిన్నట్లు తెలిపారు. హుండీ లెక్కింపులో సూపరింటెండెంట్ కొత్తపల్లి వెంకటయ్య, ప్రధాన అర్చకుడు దేవగిరి లక్ష్మన్న, ఆలయ సిబ్బంది, శ్రీసోమేశ్వర, రాజరాజేశ్వర సేవా ట్రస్టుల సభ్యులు, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


