
సేవా కార్యక్రమాలను విస్తృతం చేయాలి
జనగామ: ప్రజల్లో సామాజిక చైతన్యం కలిగించేలా లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాల్సిన అవసరం ఉందని అదనపు కలెక్టర్ పింకేష్కుమార్ అన్నారు. ఆదివారం రాత్రి జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో క్లబ్ అధ్యక్షుడు ఎడమ సంజీవరెడ్డి ఆధ్వర్యాన నిర్వహించిన లయన్స్ క్లబ్ జనగామ స్వర్ణోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ నిషేధంపై ప్రజలను అవగాహన కల్పించాలన్నారు. అహ్మదాబాద్లో చదువుకునే సమయంలో లయన్స్ సేవల గురించి వినడమే తప్ప ప్రత్యక్షంగా పాల్గొనలేక పోయానని, అధికారి హోదాలో ఇక్కడ భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందన్నారు. అంతకు ముందు క్లబ్ వ్యవస్థాపక కార్యదర్శి, దివంగత కాసం అంజయ్య సేవలను గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ ప్రతినిధులు చంద్రగిరి శ్రీనివాస్, గోవింద్రాజ్, దీపక్ భట్టాచార్య, బాబురావు, వెంకటరెడ్డి, దయాకర్ రెడ్డి, సుకుమార్, డాక్టర్ లవకుమార్రెడ్డి, ముచ్చ రాజిరెడ్డి, కన్న పరశురాములు, రఘునాథ్రెడ్డి, ప్రమోద్కుమార్, కృష్ణ జీవన్ బజాజ్, ప్రభాకర్, జయహరి, గోపయ్య, ఈశ్వర్రావు, హన్మంతరావు, డాక్టర్ కల్నల్ భిక్షపతి, బుస్సా సిద్ధేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ పింకేష్కుమార్