మహిళా కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

మహిళా కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలి

Jun 17 2025 5:38 AM | Updated on Jun 17 2025 5:38 AM

మహిళా కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలి

మహిళా కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలి

జనగామ రూరల్‌: క్షేత్రస్థాయిలో మహిళా కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలని రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గాజుల సుకన్య అన్నారు. సోమవారం డీసీసీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షురాలు బడికే ఇందిర ఆధ్యర్యాన నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. మహిళా కాంగ్రెస్‌ను బలోపేతం చేయడానికి బూత్‌, మండల, బ్లాక్‌, జిల్లా కమిటీలు పూర్తి చేయాలని, ప్రతి నెలా జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించాలని చెప్పారు. వచ్చేనెలలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయి.. కాబట్టి మండలాధ్యక్షులంతా బూత్‌ కమిటీలను పూర్తి చేసి కష్టపడి పని చేయాలన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి ప్రజాప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆరు గ్యారంటీ పథకాలను గడప గడపకు చేరేలా కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా జనగామ మండల అధ్యక్షురాలు కాముని జయకు నియామకపత్రం అందజేశారు. కార్యక్రమంలో వెంకట సుబ్బమ్మ, బొట్‌రెడ్డి శ్రీలతరెడ్డి, దేవులపల్లి భాగ్యలక్ష్మి, కొయ్యడ శోభ, గంగ కోమలత, మౌనిక, స్వప్న, ప్రవళిక, నవ్యశ్రీ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గాజుల సుకన్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement