ఒక్కొక్కరిది ఒక్కో వ్యథ | - | Sakshi
Sakshi News home page

ఒక్కొక్కరిది ఒక్కో వ్యథ

Jun 17 2025 5:18 AM | Updated on Jun 17 2025 5:18 AM

ఒక్కొ

ఒక్కొక్కరిది ఒక్కో వ్యథ

జనగామ రూరల్‌: ఒక్కొక్కరిది ఒక్కో వ్యథ.. సమస్యలు తీర్చాలంటూ ఏళ్ల తరబడి తిరుగుతున్నారు. అటు మండల స్థాయిలో.. ఇటు జిల్లా స్థాయి గ్రీవెన్స్‌లో పదుల సార్లు అర్జీలు పెట్టుకున్నా పరిష్కారానికి నోచుకోవడంలేదు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన గ్రీవెన్స్‌కు వచ్చిన ప్రజలు అధికారులకు తమ గోడు చెప్పుకుని వేడుకున్నారు. వివిధ సమస్యలపై 56 వినతులు రాగా రిజ్వాన్‌ బాషా, అదనపు కలెక్టర్లు రోహిత్‌సింగ్‌, పింకేష్‌కుమార్‌ స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. గ్రీవెన్స్‌ అర్జీలను పెండింగ్‌లో లేకుండా త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్లు సుహాసిని, హనుమాన్‌ నాయక్‌, జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్‌ ఆర్డీఓలు గోపిరామ్‌, డీఎస్‌ వెంకన్న, డీఆర్డీఓ వసంత, అధికారులు పాల్గొన్నారు.

దరఖాస్తుల్లో కొన్ని ఇలా..

● జిల్లా కేంద్రంలోని 13వ వార్డుకు చెందిన చెరుకు ప్రమీల కొడుకు శ్రీకాంత్‌ దివ్యాంగుడు. కురుస్తున్న పాత పెంకుటింట్లో జీవనం సాగిస్తున్నారు. తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని ప్రమీల అర్జీ పెట్టుకుంది.

● పాలకుర్తి మండలం ముత్తారానికి చెందిన రైతులు పొరల కృష్ణ, కర్రె రవీందర్‌, బామండ్ల పెద్దాపురం రైతులు కోమటి చెరువు బ్రాహ్మణ కుంట చెరువు శిఖంలో బోర్లు వేసి వ్యవసాయం చేస్తున్నారు. పట్టా భూములకు దారి లేకుండా చేశార ని, తాము పొలాలకు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తక్షణం చర్యలు తీసుకో వాలని గ్రామ రైతులు కోరారు.

● చిల్పూర్‌ మండలం మల్కాపూర్‌కు చెందిన గంకిడి వీరారెడ్డి అంధుడు. హైదరాబాదు జీఎస్టీ కార్యాలయంలో పనిచేస్తాడు. ‘తన వాటాకు వచ్చిన ఎకరం 10 గుంటలతో పాటు ఇంటి స్థలాన్ని అన్న, వదిన అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు.. న్యాయం చేయాలని’ అర్జీ పెట్టుకున్నాడు.

పక్క ఫొటోలోని వృద్ధురాలి పేరు బి.వీరభద్రమ్మ. తరిగొప్పులకు చెందిన ఈమె భర్త రాజేశ్వర్‌ చిరు వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కరో నా సమయంలో వీరభద్రమ్మకు పాజిటివ్‌ రావడంతో పాటు బ్లాక్‌ ఫంగస్‌, షుగర్‌, బీపీ అటాక్‌ అయింది. దీంతో ఓ కన్ను వందశాతం పోయింది. అలాగే నోట్లోని కపాలం తొలగించారు. ప్రస్తు తం ఆమెకు నెలనెలా మందులకు రూ.5వేలు ఖర్చవుతోంది. 64ఏళ్ల వయస్సులో భర్త తన రెక్క ల కష్టంతో భార్యకు చికిత్స చేయిస్తూ కంటికి రెప్పలా చూసుకుంటున్నా డు. సదరం సర్టిఫికెట్‌ కోసం శిబిరానికి వెళ్తే ‘ఒకే కన్ను పోయింది.. రెండో కన్ను పోతేనే పింఛన్‌ వస్తది’ అంటూ వెళ్లగొట్టార ని వీరభద్రమ్మ వాపోయింది. కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా కు చెబుతూ కన్నీటి పర్యంతమైంది. పింఛన్‌ కావాలంటే గిన్ని తిరకాసులేంటని ఆమె తీవ్ర మనోవేదన గురైంది.

మండలంలో 20 సార్లు..

గ్రీవెన్స్‌లో 8 సార్లు

పుట్టుకతోనే నడవలేని పరిస్థితి. పీజీ వరకు చదువుకున్నాను. అమ్మా, నాన్నకు ఒక్కడినే. వారు వృద్ధాప్యంలో ఉన్నారు. సిస్టం వర్క్‌ ఫర్ఫెక్ట్‌గా వస్తుంది. ఔట్‌ సోర్సింగ్‌ లేదా కాంట్రాక్టు పద్ధతిలో ఓ చిన్న ఉద్యోగం ఇప్పించండి. మూడేళ్ల నుంచి మండల పరిషత్‌లో 20 సార్లు, కలెక్టరేట్‌ గ్రీవెన్స్‌లో 8 సార్లు వినతిపత్రం ఇచ్చాను. నా మొర ఆలకించడం లేదు. ఆదుకోండి.

– ఏనూతల నాగరాజు, పాలకుర్తి

ఇందిరమ్మ ఇల్లు

మంజూరు చేయాలి

చిన్న పాటి వర్షానికే ఇంట్లో ఉండ లేకపోతున్నం. ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నం. మొదటి జాబితాలో పేరుఉన్నా మంజూరు సమయంలో రాలేదు. దివ్యాంగుడైన కొడుకు ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తూ తమను పోషిస్తున్నాడు. ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలి.

– చెరుకు ప్రమీల, ధర్మకంచ,

జనగామ పట్టణం

ఆలకించి సమస్యలు తీర్చండి

గ్రీవెన్స్‌లో మొరపెట్టుకున్న అర్జీదారులు

వివిధ సమస్యలపై 56 దరఖాస్తులు స్వీకరించిన కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా

ఒక్కొక్కరిది ఒక్కో వ్యథ1
1/3

ఒక్కొక్కరిది ఒక్కో వ్యథ

ఒక్కొక్కరిది ఒక్కో వ్యథ2
2/3

ఒక్కొక్కరిది ఒక్కో వ్యథ

ఒక్కొక్కరిది ఒక్కో వ్యథ3
3/3

ఒక్కొక్కరిది ఒక్కో వ్యథ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement