
ప్రేరణ సాంగ్ అద్భుతం
జనగామ: ప్రభుత్వ పాఠశాల ప్రాముఖ్యతను చాటి చెబుతూ రవీందర్ అల్లూరి రాసిన ‘బడిబాట’ ప్రేరణ సాంగ్ అద్భుతంగా ఉందని కలెక్టర్ రిజ్వాన్ బాషా కితాబిచ్చారు. ఇందుకు సంబంధించిన సీడీని సోమవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్లు పింకేష్కుమార్, రోహిత్సింగ్తో కలిసి ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల ప్రాముఖ్యత, నాణ్యమైన విద్య, విద్యార్థుల నమోదును పెంచేందుకు టీచర్లు పడుతున్న శ్రమను కళ్లకు కట్టినట్లుగా ఈ పాటలో చూపించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఈఓ భోజన్న, హెచ్ఎం రవీందర్, ఉపాధ్యాయులు వాసంతి, జ్యోతి, నర్సింహారెడ్డి, కె.సురేందర్రెడ్డి, ఎం.లింగం తదితరులు పాల్గొన్నారు.
ఇంకుడు గుంతల పరిశీలన
కొడకండ్ల : మండలంలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఇంకుడు గుంతలను కేంద్ర బృందం సోమవారం పరిశీలించింది. మొండ్రాయి, పెద్దబాయితండా, రామవరం, కొడకండ్ల గ్రామాల్లో కేంద్ర భూగర్భ జలశాఖ మినిసీ్ట్ర ఆఫ్ జలశక్తి అభియాన్ బృందం పర్యటించింది. సైంటిస్ట్ వెంకటగిరి ఆధ్వర్యంలో కేంద్ర బృందం ఇంకుడు గుంతలు, పాం పాండ్, ఫిష్ పాండ్లను పరిశీలించి, అవి వినియోగంలో ఉండడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఫ్లాంట్ మేనేజర్ వీరన్న, ఎంపీడీఓ నాగశేషాద్రిసూరి, ఏపీఓ కుమారస్వామి, ఈసీ రమేశ్, టీఏలు సుధీర్, బస్వ భాస్కర్, కందికట్ల యాకయ్య, కార్యదర్శులు మధు, శ్రీనివాస్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
వాలీబాల్ చాంపియన్ రామ్కిరణ్
చిల్పూరు: మండలంలోని శ్రీపతిపల్లి గ్రామానికి చెందిన గౌలికర్ రామ్కిరణ్ వాలీబాల్లో ఇంటర్నేషనల్ చాంపియన్ షిప్ అవార్డు అందుకున్నాడు. గతంలో వరంగల్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన నేషనల్ లెవల్ వాలీబాల్ పోటీల్లో ఇంటర్నేషనల్కు ఎంపికయ్యాడు. ఇటీవల నేపాల్లోని పొకరాలో జరిగిన అండర్–19 పోటీల్లో తెలంగాణ తరఫున ఆడి అవార్డు అందుకున్నాడు.
‘జర్నలిస్టుల పిల్లలకు
ఫీజు రాయితీ ఇవ్వాలి’
జనగామ: జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో 50 శాతం ఫీజు రాయితీ కల్పించేలా ఉత్తర్వులు ఇవ్వాలని టీఎస్ జేయూ జిల్లా అధ్యక్షుడు ఉప్పలంచి నరేందర్ సోమవారం డీఈఓ భోజన్నకు వినతి పత్రం అందజేశారు. అనంతరం నరేందర్ మాట్లాడుతూ జిల్లాలోని జర్నలిస్టుల్లో చాలా మంది పేద, మధ్య తరగతికి చెందిన వారే ఉన్నారని, వారి పిల్లల చదువులకు రాయితీ కల్పించాలని కోరారు. స్పందించిన డీఈఓ త్వరలోనే ఉత్తర్వులు ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో టీఎస్ జేయూ ఉపాధ్యక్షుడు గంగిశెట్టి మహేష్కుమార్, కోశాధికారి కొన్నె ఉపేందర్, కార్యవర్గ సభ్యులు చేల్లోజు నవీన్ కుమార్, ఓంకార్, గన్ను కార్తీక్, ఎండీ.అఫ్రోజ్, ప్యాట రాజు తదితరులు పాల్గొన్నారు.
ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
జనగామ రూరల్ : ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. జిల్లాకు సంబంధించి సెకండ్ ఇయర్లో 1,227 మంది పరీక్ష రాయగా 740 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలురు 720 మందికి 429 ఉన్నారు. ఫస్ట్ ఇయర్లో 2,007 మందికి 1,282 పాసయ్యారు. ఇందులో బాలురు 829 మందికి 430 మంది, బాలికలు 1,178 మందికి 852 మంది ఉత్తీర్ణత సాధించారు. ఫస్టియర్ ఒకేషనల్లో 343 మందికి 221 మంది, సెకండియర్లో 376 మందికి 192 మంది పాసైనట్లు ఇంటర్ విద్యాధికారి జితేందర్ రెడ్డి తెలిపారు.

ప్రేరణ సాంగ్ అద్భుతం

ప్రేరణ సాంగ్ అద్భుతం

ప్రేరణ సాంగ్ అద్భుతం