ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలి

Jun 16 2025 5:49 AM | Updated on Jun 16 2025 5:49 AM

ఉపాధ్

ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలి

టీఎస్‌యూటీఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షుడు జయప్రకాశ్‌

స్టేషన్‌ఘన్‌పూర్‌: రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఎంఈఓ పోస్టులను, ఉప విద్యాధికారి పోస్టులు, డైట్‌ అధ్యాపకులు, బీఎడ్‌ కళాశాల అధ్యాపకుల పోస్టులను అర్హులైన ఉపాధ్యాయులచే పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని టీఎస్‌యూటీఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షుడు మంగు జయప్రకాశ్‌ డిమాండ్‌ చేశారు. ఘన్‌పూర్‌ డివిజన్‌కేంద్రంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 700 ప్రధానోపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, హైస్కూ ల్‌లలో సబ్జెక్టు టీచర్ల కొరత ఉందని, 23 జిల్లాల్లో డీఈఓ పోస్టులు, డిప్యూటీ డీఈఓ, ఎంఈఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఆయా పోస్టులకు ఈనెల చివరివరకు పదోన్నతులు నిర్వహించి ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా లేకుండా చూడాలని కోరారు. నూతనంగా ఏర్పాటైన ఘన్‌పూర్‌ మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులకు నిబంధనల ప్రకారం 13 శాతం ఇంటి అద్దె భత్యం చెల్లించాలన్నారు. సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించిన ఉపాధ్యాయులకు రెమ్యూనరేషన్‌ చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

ప్రజల ఆశీర్వాదంతో

త్వరగా కోలుకుంటా..

వీడియో సందేశంలో ఎమ్మెల్యే పల్లా

జనగామ: నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని ప్రజాజీవితంలో యథావిధిగా పాలుపంచుకుంటానని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి యశోద ఆస్పత్రి నుంచి వీడియో సందేశం ద్వారా ఆదివారం స్పష్టం చేశారు. ఈనెల 11వ తేదీన ప్రమాదవశాత్తు బాత్‌రూంలో కాలు జారి పడడంతో గాయమైయిందన్నారు. అందరి ఆశీర్వాదాలతో నాలుగు గంటలు ఆపరేషన్‌ విజయవంతం అయిందన్నారు. జనగామ నుంచి తనను కలిసేందుకు చాలామంది వస్తున్నారని, మేజర్‌ ఆపరేషన్‌ కావడంతో వైద్యులు రెండు వారాల పాటు పూర్తి విశ్రాంతి కావాలని చెప్పారన్నారు. ఆరోగ్యం కుదుటపడగానే ప్రతిఒక్కరిని కలుసుకుంటానన్నారు.

డాక్టర్‌కు ఉత్తమ అవార్డు

దేవరుప్పుల: వైద్య వృత్తిలో విస్తృత సేవలు అందించినందుకు గాను ఓ టీవీ చానల్‌ ఆధ్వర్యంలో ప్రముఖ సర్జన్‌ వైద్యుడు లకావత్‌ లక్ష్మీనారాయణనాయక్‌కు ఉత్తమ డాక్టర్‌ అవార్డు లభించింది. ఆదివారం హైదరాబాద్‌లోని హైటెక్‌ సిటీలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు.

గవర్నర్‌ చేతుల మీదుగా సీపీకి అవార్డు

వరంగల్‌ క్రైం: అత్యధిక సంఖ్యలో రక్తదానం చేసేందుకు ప్రోత్సహించినందుకుగాను వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌సింగ్‌కు ఆదివారం రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ రెడ్‌క్రాస్‌ అవార్డు ప్రదానం చేశారు. ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌ సంస్కృతి కమ్యూనిటీ హాల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీపీ హై బ్లడ్‌ డోనర్‌ మోటివేటర్‌ అవార్డు అందుకున్నారు.

నాటక రంగాన్ని

భావితరాలకు అందించాలి

హన్మకొండ కల్చరల్‌ : నాటక రంగాన్ని భావితరాలకు అందించాలని, కళాకారులను ప్రోత్సహిస్తూ దాతలు సహకరించాలని కేంద్ర ఖాదీ చిన్నపరిశ్రమల మాజీ డైరెక్టర్‌ ఈగ మల్లేశం అన్నారు. తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతికశాఖ, రాష్ట్ర చలనచిత్ర, నాటకరంగ అభివృద్ధి సంస్థ హైదరాబాద్‌ సౌజన్యంతో వరంగల్‌ జిల్లా రంగస్థల కళాకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మూడు రోజులపాటు జరిగిన 16వ జాతీయస్థాయి నాటిక పోటీలు ఆదివారంతో ముగిశాయి. వరంగల్‌ పోతన విజ్ఞానపీఠం ఆ డిటోరియంలో ఐక్యవేదిక అధ్యక్షుడు కాజీపేట తిరుమలయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఈగ మల్లేశం పాల్గొని మాట్లాడారు.

ఉపాధ్యాయులకు  పదోన్నతులు కల్పించాలి1
1/2

ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలి

ఉపాధ్యాయులకు  పదోన్నతులు కల్పించాలి2
2/2

ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement