జనగామ రూరల్ : పట్టణంలో ఇందిరమ్మ లబ్ధిదారులు నిర్మించుకున్న ఇళ్లకు వెంటనే ఇంటి నంబర్లు వేసి కనీస సౌకర్యాలు కల్పించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం సీపీఎం పట్టణ కార్యదర్శి జోగు ప్రకాశ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. సమస్యను వారం రోజుల్లో పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కనీస సౌకర్యాలు కల్పించి పేదలను ఆదుకోవాలని లేని పక్షంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్కు బుద్ధి చెప్తామని హెచ్చరించారు. జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు రాపర్తి రాజు, అహల్య, బొట్ల శేఖర్, జిల్లా కమిటీ సభ్యులు బూడిద గోపి, ఉపేందర్, చందు నాయక్, బొట్ల శ్రావణ్, పాము శ్రీకాంత్, బాలమణి, పాముకుంట్ల చందు, సుమ, ఎండీ గౌసియా, నాజియా తదితరులు పాల్గొన్నారు.
సీపీఎం జిల్లా కార్యదర్శి కనకారెడ్డి