రైతన్నతో ‘సీఎం’ విజయవంతం | - | Sakshi
Sakshi News home page

రైతన్నతో ‘సీఎం’ విజయవంతం

Jun 17 2025 5:40 AM | Updated on Jun 17 2025 5:40 AM

రైతన్నతో ‘సీఎం’ విజయవంతం

రైతన్నతో ‘సీఎం’ విజయవంతం

జనగామ: రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగం అభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాల అమలు తీరును తెలుసుకునేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యాన సోమవారం చేపటిన ముఖాముఖి కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. హైదరాబాద్‌ ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పలువురు మంత్రులు, సీ.ఎస్‌ కె.రామకృష్ణారావులతో కలిసి సీఎం 1,031 రైతు వేదికల నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా రైతులతో ముఖాముఖిగా మాట్లాడారు. జిల్లాలోని 12 వేదికల్లో వీసీ అందుబాటులో ఉండగా.. మరో 24 చోట్ల ఏర్పాటు చేసిన నూతన వీసీలను ముఖ్యమంత్రి వర్చువల్‌గా ప్రారంభించారు. మొత్తంగా 36 రైతు వేదికల్లో జిల్లా నుంచి 7,500 మంది రైతులు పాల్గొన్నారు. జనగామ మండలం చీటకోడూరు రైతు వేదికలో ఏఎంసీ చైర్మన్‌ బనుక శివరాజ్‌ యాదవ్‌, ఆర్టీ మెంబర్‌ అభిగౌడ్‌, జిల్లా వ్యవసాయధికారి రామారావు, ఎన్పీడీసీఎల్‌ ఎస్‌ఈ వేణుమాధవ్‌తో కలిసి కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా పాల్గొన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్‌, పాలకుర్తి, కొడకండ్ల, చిల్పూరు, రఘునాథపల్లి, దేవరుప్పుల, బచ్చన్నపేట పరిధిలో అదనపు కలెక్టర్లు పింకేష్‌కుమార్‌, రోహిత్‌సింగ్‌, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఏఎంసీ చైర్మన్లు పాల్గొన్నారు.

ముఖాముఖిలో 7,500 మంది రైతులు

36 రైతు వేదికల్లో ప్రత్యక్ష ప్రసారం

పండుగ వాతావరణంలో స్వాగతం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement