విద్యుత్‌ పనులు త్వరగా పూర్తిచేయాలి | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ పనులు త్వరగా పూర్తిచేయాలి

Jun 17 2025 5:38 AM | Updated on Jun 17 2025 5:38 AM

విద్యుత్‌ పనులు త్వరగా పూర్తిచేయాలి

విద్యుత్‌ పనులు త్వరగా పూర్తిచేయాలి

జనగామ రూరల్‌ : విద్యుత్‌ సమస్యలతో పాటు పెండింగ్‌లో ఉన్న డీడీ పనులను వెంటనే పూర్తి చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా చందు నాయక్‌ విద్యుత్‌ శాఖ అధికారులను కోరారు. సోమవారం ఏఈకి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా చందు నాయక్‌ మాట్లాడుతూ.. మండలంలోని బోరుబావుల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్‌ తీగలు కిందికి వేలాడుతున్నాయని వాటిని సరిచేయాలన్నారు. రైతులు, పశువులు విద్యుత్‌ ప్రమాదాలకు గురవుతున్నారని కొత్త విద్యుత్‌ తీగలు అమర్చాలని కోరారు. డీడీలు చెల్లించిన రైతులు రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగకుండా పనులు త్వరగా చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు మంగ భీరయ్య, నాయకులు విజయ్‌కాంత్‌, రజనీకాంత్‌, బాలుతో పాటు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement