
సన్మాన సభకు తరలిరండి
జనగామ రూరల్ : మంద కృష్ణమాదిగ సన్మాన సభకు లక్షలాదిగా దివ్యాంగులు తరలి రావాలని వీహెచ్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బిర్రు నగేష్ పిలుపునిచ్చారు. సోమవారం వీహెచ్పీఎస్ జిల్లా అధ్యక్షుడు గడ్డం సోమరాజు అధ్యక్షతన జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పద్మశ్రీ అందుకున్న మంద కృష్ణను ఈ నెల 19వ తేదీన హైదరాబాద్లోని నాగోల్ శుభం ఫంక్షన్లో వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో భారీ సన్మాన సభ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ధరావత్ స్వామి, ఉడుత అనిల్, పశువుల సోమయ్య, జగన్ తదితరులు పాల్గొన్నారు.