పార్టీలకు ‘స్థానిక’ జోష్‌! | - | Sakshi
Sakshi News home page

పార్టీలకు ‘స్థానిక’ జోష్‌!

Jun 16 2025 5:57 AM | Updated on Jun 16 2025 5:57 AM

పార్టీలకు ‘స్థానిక’ జోష్‌!

పార్టీలకు ‘స్థానిక’ జోష్‌!

మంత్రి పొంగులేటి ప్రకటనతో పల్లెల్లో మొదలైన ఎన్నికల సందడి

వారంలో నోటిఫికేషన్‌

ఉంటుందన్న సంకేతాలు

నేటి కేబినెట్‌ మీటింగ్‌ తర్వాత

మరింత స్పష్టత

ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు

ఆతర్వాతే సర్పంచ్‌, మున్సిపల్‌ ఎన్నికలు

అధికార పార్టీలో మళ్లీ మొదలైన

ఆశావహుల ప్రయత్నాలు

‘స్థానిక’ ఎన్నికలకు

రాజకీయ పార్టీల సమాయత్తం

సాక్షి ప్రతినిధి, వరంగల్‌:

ల్లెల్లో మళ్లీ స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. పొలిటికల్‌ పార్టీలకు ఎలక్షన్‌ జోష్‌ వచ్చింది. వారం, పది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్‌ ఉంటుందన్న మంత్రుల వ్యాఖ్యలు.. ఎన్నికల వేడిని రగిలించాయి. మూడు రోజుల క్రితం మహబూబాబాద్‌ జిల్లాలో జరిగిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో ‘ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. అత్యధికంగా గెలిచేలా సిద్ధంగా ఉండాలి’ అని నాయకులకు మార్గనిర్దేశం చేసిన మంత్రి ధనసరి సీతక్క పరోక్షంగా ‘స్థానిక’ ఎన్నికల సంకేతాలు ఇచ్చారు. రెవెన్యూ, గృహనిర్మాణశాఖ, జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఏకంగా వారం రోజుల్లో నోటిఫికేషన్‌ వస్తుందని, ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయని ప్రకటించారు. సోమవారం జరిగే కేబినెట్‌ మీటింగ్‌లో నిర్ణయం తీసుకుంటామని కూడా చెప్పారు. దీంతో అధికార కాంగ్రెస్‌తో పాటు బీఆర్‌ఎస్‌, బీజేపీ తదితర పార్టీలు పోటీకి సమాయత్తం అవుతున్నాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అన్ని పార్టీల ఆశావహులు పోటీ చేసేందుకు మళ్లీ పావులు కదుపుతున్నారు.

పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు!

మంత్రుల వ్యాఖ్యలు, ఇదే అంశంపై సోమవారం కేబినెట్‌లో కీలక నిర్ణయం తీసుకుంటామనడంతో ‘స్థానిక’ ఎన్నికల నగారా ఖాయమన్న చర్చ జరుగుతో ంది. 2019 ఏప్రిల్‌ 20న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైంది. మే 6, 10, 14 తేదీల్లో మూడు విడతలుగా పోలింగ్‌ నిర్వహించారు. 27న ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటించారు. ఈసారి కూడా మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉండగా.. ఇప్పటికే జిల్లాల వారీగా ఎన్నికల, అధికార యంత్రాంగం ఎప్పుడు నోటిఫికేషన్‌ వచ్చినా ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా పోలింగ్‌ కేంద్రాలు, బూత్‌లు, ఓటరు జాబితాలను సిద్ధం చేశారు. 2019 ఎన్నికల సమయంలో రిజర్వేషన్ల ప్రకారం జెడ్పీ చైర్మన్‌ పదవులు కేటాయించారు. వరంగల్‌ అర్బన్‌ (హనుమకొండ) ఎస్సీ పురుషుడు/మహిళ, వరంగల్‌ రూరల్‌ (వరంగల్‌) జనరల్‌, జనగామ అన్‌ రిజర్వుడ్‌ కోటాలో పురుషుడు/మహిళ, జయశంకర్‌ భూపాలపల్లి ఎస్సీ మహిళ, ములుగు అన్‌ రిజర్వుడ్‌ పురుషుడు/మహిళ, మహబూబాబాద్‌ ఎస్టీ మహిళకు కేటాయించారు. అలాగే ఎంపీటీసీ, ఎంపీపీలు, సర్పంచ్‌లకు కూడా రిజర్వేషన్లు ఇచ్చారు. అయితే ఈసారి నిర్వహించబోయే ఎన్నికల్లో పాత రిజర్వేషన్‌లనే పరిగణనలోకి తీసుకుంటారా? లేక కొత్త నిబంధనలు తీసుకొస్తారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

2019 ఎన్నికల్లో జిల్లాల వారీగా మొత్తం జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ స్థానాలు

జిల్లా పేరు జెడ్పీటీసీ ఎంపీపీ ఎంపీటీసీ

స్థానాలు స్థానాలు స్థానాలు

వరంగల్‌ అర్బన్‌ 07 07 86

వరంగల్‌ రూరల్‌ 16 16 178

భూపాలపల్లి 11 11 106

ములుగు 09 09 72

మహబూబాబాద్‌ 16 16 198

జనగామ 12 12 140

మొత్తం 71 71 780

సర్పంచ్‌ ఎన్నికలకు సమయం ఉంది..

వాస్తవానికి గతంలో సర్పంచ్‌ ఎన్నికలు ముందు జరిగి.. తర్వాతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిగాయి. 2019లో పంచాయతీ ఎన్నికలు జనవరిలో జరిగితే, మే, జూన్‌లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, జెడ్పీ చైర్మన్‌ ఎన్నికల తంతు జరిగింది. ఈసారి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలే ముందు జరిపించే అవకాశం ఉందనడంతో సర్పంచ్‌, వార్డు సభ్యులు, మున్సిపల్‌ చైర్మన్‌, సభ్యుల ఎన్నికలకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. 2019లో ఉమ్మడి వరంగల్‌లో మంగపేట మండలం, ఏకగ్రీవమైన 305 పంచాయతీలు మినహా 1,403 గ్రామ పంచాయతీల్లో మూడు విడతల్లో ఎన్నికలు జరిగాయి. ఈసారి కూడా గతేడాది జూలైలోనే అధికారులు పంచాయతీల ఎన్నికలకు సర్వం సిద్ధం చేశారు. 1,705 జీపీల్లో 15,056 వార్డుల్లో 22,45,394 మంది ఓటర్లను గుర్తించిన అధికారులు ఆ మేరకు పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే ప్రభుత్వం అప్పుడు ఎన్నికలకు విముఖత వ్యక్తం చేయడంతో సర్పంచ్‌ల పదవీకాలం ముగిసిన వెంటనే స్పెషల్‌ ఆఫీసర్లను నియమించారు. కాగా.. తాజాగా ఎన్నికల ప్రస్తావన తెర మీదకు రావడంతో అన్ని పార్టీల ఆశావహులతో సందడి మొదలైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement