శ్రీశ్రీ అడుగుజాడల్లో నడవాలి | - | Sakshi
Sakshi News home page

శ్రీశ్రీ అడుగుజాడల్లో నడవాలి

Jun 16 2025 5:49 AM | Updated on Jun 16 2025 5:49 AM

శ్రీశ్రీ అడుగుజాడల్లో నడవాలి

శ్రీశ్రీ అడుగుజాడల్లో నడవాలి

జనగామ రూరల్‌: మహాకవి శ్రీశ్రీ అడుగుజాడల్లో ప్రతిఒక్కరూ నడవాలని శ్రీశ్రీ కళావేదిక రాష్ట్ర కార్యదర్శి లగిశెట్టి ప్రభాకర్‌ అన్నారు. జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని స్కాలర్‌ గ్రామర్‌ స్కూల్‌లో ఆదివారం శ్రీశ్రీ (శ్రీరంగం శ్రీనివాస్‌) వర్థంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో పలువురు మాట్లాడుతూ సమసమాజ నిర్మాణానికి శ్రీశ్రీ కవిత్వం పునాదులు వేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కవులు కళాకారులు సాంబరాజు యాదగిరి, జి.కృష్ణ, పెట్లోజు సోమేశ్వరాచారి, అయిలా సొమనర్సింహచారి, నక్క సురేష్‌, చిలుమోజు సాయికిరణ్‌, డాక్టర్‌ వేముల సదానందం, పొట్టబత్తిని భాస్కర్‌, గడ్డం మనోజ్‌ కుమార్‌, రంగరాజు ప్రసాద్‌, గూటం రమేష్‌, తాళ్లపల్లి లక్ష్మణ్‌ గౌడ్‌, గుండె కనకయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement