పారిశ్రామిక కారిడార్‌ ఏమైంది..?

సమావేశంలో మాట్లాడుతున్న వీరయ్య  - Sakshi

జనగామ రూరల్‌: బీజేపీ మోసపూరిత వాగ్ధానాలతో ప్రజలను మఽభ్యపెడుతూ పబ్బం గడుపుకుంటుందని.. జనగామకు పారిశ్రామిక కారిడార్‌ ఏమైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎస్‌.వీరయ్య విమర్శించారు. మంగళవారం జనగామలోని వైష్ణవి ఫంక్షన్‌ హాల్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలు అవలంభిస్తూ పెట్టుబడిదారులకు దేశ సంపదను దోచి పెడుతుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. మతోన్మాద విధానాలు రెచ్చగొడుతూ ప్రజాస్వామ్య హక్కులు కాలరాస్తుందని విమర్శించారు. ప్రశ్నించే వారిపై దాడులకు పాల్పడుతూ అరాచకాలు చేస్తుందన్నారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు మరిచిపోయిందన్నారు. కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ గురించి మాట్లాడే స్థితిలో మోదీ లేరన్నారు. బుధవారం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు వేలాదిగా తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండీ అబ్బాస్‌, జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి, రాష్ట్ర నాయకులు స్కైలాబ్‌బాబు, ఆశయ్య, అడవయ్య, జయలక్ష్మి, రాపర్తి రాజు, శేఖర్‌, ప్రకాశ్‌, గోపి, విజేందర్‌ పాల్గొన్నారు.

సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు

ఎస్‌.వీరయ్య

Read latest Jangaon News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top