రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించి కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలి. ఎప్పుడో వివాహమైన తర్వాత ఇప్పుడు కుట్టుమిషన్ల కోసం పుట్టింటికి వెళ్లి సంబంధిత తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవడం ద్వారా అక్కడ రెవెన్యూ అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
– తలారి నాగమణి, సర్పంచ్, మైతాపూర్
ఆధారాలు సమర్పిస్తే జారీ
ఆదర్శ వివాహాలు పెరిగిన నేపథ్యంలో భర్త కులం ఆధారంగా భార్యకు కుల ధ్రువీకరణపత్రం జారీ చేయడం సాధ్యం కాదు. అనర్హులు లబ్ధిపొందే అవకాశం ఉంది. కొంతమంది ఈ సర్టిఫికెట్లను ఇతరత్రా ఉపయోగాలకు వాడుకునే అవకాశం ఉంది. అన్ని వివరాలు పరిశీలించిన అనంతరం ధ్రువీకరణ పత్రం జారీ చేస్తాం.
– నాగార్జున, తహసీల్దార్, రాయికల్


