కల్యాణం... కమనీయం | - | Sakshi
Sakshi News home page

Feb 25 2023 1:40 PM | Updated on Feb 26 2023 5:46 AM

కల్యాణం జరిపిస్తున్న అర్చకులు - Sakshi

కల్యాణం జరిపిస్తున్న అర్చకులు

రాయికల్‌(జగిత్యాల): భూపతిపూర్‌ గ్రామంలోని లక్ష్మీనృసింహస్వామి కల్యాణం శుక్రవారం కమనీయంగా జరిపించారు. అర్చకులు గిరిధారాచార్యులు, రామకృష్ణాచార్యుల ఆధ్వర్యంలో ఉత్సవమూర్తులకు తొలుత ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేద మంత్రోచ్ఛారణ మధ్య కల్యాణం జరిపించారు. వేలాదిమంది భక్తులు కల్యాణాన్ని తిలకించి మొక్కులు చెల్లించుకున్నారు. సర్పంచ్‌ జక్కుల చంద్రశేఖర్‌, వైస్‌ ఎంపీపీ మహేశ్వర్‌రావు, ఉపసర్పంచ్‌ అన్నవేని వేణు, సింగిల్‌ విండో చైర్మన్‌ ఏనుగు ముత్యంరెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్‌ సంకోజి మహేశ్‌, అర్చకులు వెంకటకృష్ణ, రమణ పాల్గొన్నారు.

తరలివచ్చిన భక్తులు1
1/1

తరలివచ్చిన భక్తులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement