Study reveals one in 20 new cases of diabetes could be linked to Covid - Sakshi
Sakshi News home page

కరోనాతో డయాబెటిస్‌ ముప్పు..! 

Apr 20 2023 10:39 AM | Updated on Apr 20 2023 11:01 AM

Study Reveals One In 20 New Cases Of Diabetes Could Linked To Covid - Sakshi

లండన్‌: కరోనా సోకిన వారికి డయాబెటిస్‌ ముప్పు అధికమని బ్రిటిష్‌ కొలంబియా సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్, వేన్‌కవర్‌లోని సెయింట్‌ పాల్‌ ఆస్పత్రి అధ్యయనంలో వెల్లడైంది. 20లో ఒక డయాబెటిస్‌ కేసుకు కరోనా కారణమని తేలింది. కరోనా పాజిటివ్‌ వచ్చి కోలుకున్న 6,29,935 మందిని తర్వాత కాలంలో వచి్చన  వ్యాధులపై అధ్యయనం చేశారు.

కరోనా కారణంగా చక్కెర వ్యాధిగ్రస్తులు 3 నుంచి 5% పెరుగుతున్నట్టుగా అధ్యయనంలో వెల్లడైంది. కొత్తగా ప్రతీ 100 మంది మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో 3–5% కేసులకు కరోనాతో సంబంధముందని బ్రిటిష్‌ కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్‌ నవీడ్‌ జన్‌జువా చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement