ఆ దేశాల్లో కరోనా రోగుల్ని గుర్తించే శునకాలు

అబుధాబి: ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి కొన్ని దేశాలు శునకాల సాయం తీసుకుంటున్నాయి. కరోనా ఇన్ఫెక్షన్ వాసనని శునకాలు పసిగడతాయని ఇప్పటికే అధ్యయనాల్లో తేలిన విషయం తెలిసిందే. యూఏఈ, ఫిన్ల్యాండ్, లెబనాన్ దేశాల్లో రోగుల్లో కరోనా లక్షణాలు బయటపడక ముందే శునకాలు రోగుల్ని గుర్తిస్తున్నాయి. లెబనాన్ విమానా శ్రయానికి వచ్చిన 1,680 మంది ప్రయాణికుల్లో 159 మందిని కరోనా రోగులుగా శునకాలు గుర్తిస్తే, వారిలో 92 శాతం మందికి కరోనా ఉన్నట్టుగా ఆ తర్వాత తేలిందని అధికారులు చెప్పారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి