బ్రెజిల్లో డెల్టా ఎయిర్లైన్స్ విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. విమానాశ్రయం నుండి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఇంజిన్లో పేలుడు సంభవించి విమానం గాల్లో ఉండగానే మంటలు చెలరేగాయి. ఈ వివరాలు తెలుసుకున్న ఫైలట్ ఎలాంటి ఆందోళనకు లోనుకాకుండా చాకచాక్యంగా వ్యవహరించారు. విమానాన్ని సురక్షితంగా రన్వేపై ల్యాండ్ చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణ సమయంలో విమానంలో 288 మంది ప్రయాణికులున్నారు. ఫైలట్ అప్రమత్తతతో భారీ ప్రమాదం తప్పింది.


