భారత్‌పై యుద్ధానికి.. పాకిస్తాన్‌ మరో మిసైల్‌ ప్రయోగం | Pakistan test fires 2nd missile as tensions with India over Pahalgam incident | Sakshi
Sakshi News home page

భారత్‌పై యుద్ధానికి.. పాకిస్తాన్‌ మరో మిసైల్‌ ప్రయోగం

May 5 2025 2:42 PM | Updated on May 5 2025 3:38 PM

Pakistan test fires 2nd missile as tensions with India over Pahalgam incident

ఇస్లామాబాద్‌: పహల్గాం ఉగ్రదాడితో భారత్‌-పాకిస్తాన్‌ల మధ్య యుద్ధ భయాలు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో పాకిస్తాన్‌ ఫతహ్ అనే సర్ఫేస్-టు-సర్ఫేస్ మిసైల్‌ను పరీక్షించింది. 120 కిలోమీటర్ల రేంజ్‌ శత్రు స్థావరాల్ని నిర్విర్యం చేస్తుందని పాకిస్తాన్‌ ఆర్మీ ప్రకటించింది.  

ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) విడుదల చేసిన ప్రకటనలో ఈ మిసైల్‌ టెస్ట్‌ ప్రధానంగా మిస్సైల్‌ హార్డ్‌వేర్‌,సాఫ్ట్‌వేర్‌ పనితీరును పరీక్షించడం, అలాగే మిసైల్‌లో ఉపయోగించిన ఆధునిక నావిగేషన్ వ్యవస్థ, ఖచ్చితత్వాన్ని నిర్ధారించడమే దీని ముఖ్య ఉద్దేశమని పేర్కొంది. ఈ ప్రయోగానికి రెండ్రోజుల ముందు పాకిస్తాన్ 450 కిలోమీటర్ల రేంజ్‌అబ్దాలి వెపన్ సిస్టమ్ మిసైల్‌ను పరీక్షించినట్టు ప్రకటించింది.

కొనసాగుతున్న ఉద్రిక్తత 
ఈ మిలటరీ చర్యలు పాకిస్తాన్-భారతదేశాల మధ్య పెరిగుతున్న ఉద్రిక్తతల మధ్య జరుగుతున్నాయి. ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్ర దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా అనుబంధ గ్రూప్ ఈ దారుణానికి ఒడిగట్టింది.  

పాక్‌పై భారత్‌ ఆంక్షలు
దీనికి ప్రతిగా, భారత్.. పాకిస్తాన్‌పై కఠిన చర్యలు తీసుకుంటుంది. ఇండస్ వాటర్ ట్రీటీని నిలిపివేయడం, పాకిస్తాన్ పౌరులకు జారీ చేసిన వీసాలను రద్దు వంటి చర్యలు ఉన్నాయి. మరోవైపు, పాకిస్తాన్ తరచూ నియంత్రణ రేఖ (LoC) వద్ద కాల్పులకు పాల్పడుతుండగా, భారత్ కూడా గట్టి ప్రతిస్పందన ఇస్తోంది.

ఏక్షణంలోనైనా పాక్‌పై భారత్‌ దాడి
ప్రధానమంత్రి మోదీ భారత సైన్యానికి ఫ్రీ హ్యాండ్‌ ఇచ్చారు. ఈ నిర్ణయంతో భారత సైన్యం పాకిస్తాన్‌పై ఏ క్షణంలో మెరుపు దాడి చేసే దిశగా సన్నాహాలు కొనసాగిస్తోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement