రేబిస్‌తో ఉన్మాదిగా మారి చంపి తిన్నాడు! | Mumbai man infected with rabies killed elderly woman in Pali and then ate her flesh | Sakshi
Sakshi News home page

రేబిస్‌తో ఉన్మాదిగా మారి చంపి తిన్నాడు!

May 28 2023 5:00 AM | Updated on May 28 2023 5:00 AM

Mumbai man infected with rabies killed elderly woman in Pali and then ate her flesh - Sakshi

జైపూర్‌: రాజస్తాన్‌లో ఒళ్లు జలదరించే ఘటన ఒకటి చోటుచేసుకుంది. ఉన్మాదిగా మారిన ఓ వ్యక్తి వృద్ధురాలిని చంపి, ఆమె మాంసం తిన్నాడు. ముంబైలో ఉండే సురేంద్ర ఠాకూర్‌(24) ఇటీవలే తన సొంత పాలి జిల్లా సెండ్రా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని సరధనా గ్రామానికి వచ్చాడు.

పిచ్చిపట్టినట్లు ప్రవర్తిస్తున్న అతడు శుక్రవారం పొలంలో పశువులు మేపుకుంటూ ఉన్న శాంతిదేవి(65)ని బండరాయితో మోది చంపేశాడు. అనంతరం ఆమె మాంసం తిన్నాడు. గమనించిన చుట్టుపక్కల వారు అతడిని అతికష్టమ్మీద పట్టుకుని పోలీసులకు అప్పగించారు. హత్య, నరమాంసభక్షణ నేరం కింద  పోలీసులు కేసు పెట్టారు. ఠాకూర్‌ను ఆస్పత్రిలో చేర్పించారు. రేబిస్‌ వ్యాధి(హైడ్రోఫోబియా) బాధితుల్లో వ్యాధి ముదిరితే చివరి దశలో ఇలాంటి లక్షణాలే కనిపిస్తాయని వైద్యులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement