హ్యూస్టన్‌ వీధుల్లో ‘జై శ్రీరాం’ నినాదాలు.. భారీ ర్యాలీ! | Ayodhya Ram Mandir: Jai Shri Ram Echo In USA | Sakshi
Sakshi News home page

Car Rally in America: హ్యూస్టన్‌ వీధుల్లో ‘జై శ్రీరాం’ నినాదాలు.. భారీ ర్యాలీ!

Jan 9 2024 12:47 PM | Updated on Jan 9 2024 1:08 PM

Jai Shri Ram is Echoing in Usa - Sakshi

జనవరి 22న అయోధ్యలోని నూతన రామాలయంలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. భారత్‌లోనే కాకుండా ప్రపంచంలోని అనేక దేశాల్లో ఈ కార్యక్రమంపై ఆసక్తి నెలకొంది. ఈ నేపధ్యంలో సప్త సముద్రాలు దాటి మరీ ‘జై శ్రీరామ్’ నినాదాలు మిన్నంటుతున్నాయి. 

అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్టపై అమెరికాలోనూ ఉత్సాహం కనిపిస్తోంది. జనవరి 22న అయోధ్యలో జరిగే పవిత్రోత్సవానికి హాజరుకావాలని ఆలయ నిర్వాహకులకు అమెరికాలోని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ఆహ్వానం పంపింది. ఈ నేపధ్యంలో హ్యూస్టన్‌లో భక్తులు ఎంతో ఉత్సాహంతో కారు ర్యాలీ చేపట్టారు. హిందూ అమెరికన్ కమ్యూనిటీ సభ్యులు హ్యూస్టన్‌లో ‘జై శ్రీరామ్’ నినాదాలు చేస్తూ, భారీ స్థాయిలో కారు ర్యాలీని చేపట్టారు. 500 మందికి పైగా భక్తులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. 216 కార్లతో ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీ 100 మైళ్ల మేర సాగింది. ఈ ర్యాలీని శ్రీ మీనాక్షి ఆలయం దగ్గర ప్రారంభించి, రిచ్‌మండ్‌లోని శ్రీ శారదాంబ ఆలయం వద్ద ముగించారు.

జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ చేపట్టిన ఈ ర్యాలీ 11 దేవాలయాల మీదుగా సాగింది. సుమారు రెండు వేల మందికి పైగా భక్తులు సంకీర్తనలతో శోభాయాత్రకు స్వాగతం పలికారు. వీహెచ్‌పీఏ సభ్యుడు అమర్‌ మాట్లాడుతూ హ్యూస్టన్‌వాసుల హృదయాల్లో శ్రీరాముడు కొలువైవున్నాడన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement