విషాదం : కాల్పుల్లో 12 మంది మృతి | Gun Firing In US 12 People Deceased | Sakshi
Sakshi News home page

అమెరికాలో కాల్పులు: 12 మంది మృతి

Sep 19 2020 11:49 AM | Updated on Sep 19 2020 12:31 PM

Gun Firing In US 12 People Deceased - Sakshi

వాష్టింగన్‌ : అగ్రరాజ్యం అమెరికా మరోసారి రక్తమోడింది. న్యూయార్క్‌లోని రోచెస్టర్‌లో పెద్ద ఎత్తున కాల్పులు చోటుచేసుకున్నాయి. గుర్తు తెలియని దుండుగులు జరిపిన ఈ కాల్పుల్లో 12 మంది పౌరులు అక్కడికక్కడే మృతి చెందారు. రోచెస్టర్‌లో వేర్వేరు ప్రాంతాల్లో కాల్పులు జరిగినట్టు గుర్తించారు. అమెరికా కాలమానం ప్రకారం అర్థరాత్రి 12.30కు ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. అయితే దేశంలో నల్లజాతీయులపై జరుగుతున్న వివక్షకు వ్యతిరేకంగా రోచెస్టర్‌లో అర్థరాత్రి వరకుఆందోళన కొనసాగాయి. ఈ ఆందోళన కొనసాగుతుండగానే కాల్పులు చెలరేగాయి. ఈ ఘటనలో పెద్ద ఎత్తున పౌరులు తీవ్ర గాయలపాలైయ్యారు. పౌరుల మృతిపై యావత్‌ అమెరికా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. కాల్పులకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. (దక్షిణాసియాలో ఉగ్రవాదాన్ని సహించం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement