పెద్ది కుటుంబానికి కేసీఆర్‌ ఓదార్పు | - | Sakshi
Sakshi News home page

పెద్ది కుటుంబానికి కేసీఆర్‌ ఓదార్పు

Aug 10 2026 1:58 AM | Updated on Aug 10 2026 1:58 AM

సాక్షి, వరంగల్‌/నల్లబెల్లి: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబానికి బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఆత్మీయ ఓదార్పునిచ్చారు. సుదర్శన్‌రెడ్డి దశదినకర్మ సందర్భంగా ఆదివారం వరంగల్‌ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలోని పెద్ది స్వగృహానికి కేసీఆర్‌ వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించారు. విషాదంలో ఉన్న పెద్ది సతీమణి స్వప్నను ఓదార్చి ధైర్యం చెప్పారు. రోడ్డు మార్గంలో కేసీఆర్‌ మధ్యాహ్నం 3.50 గంటలకు నల్లబెలికి చేరుకున్నారు. తొలుత సుదర్శన్‌రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పి ంచారు. అనంతరం ఇంట్లోకి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కేసీఆర్‌ను చూడగానే స్వప్న భావోద్వేగానికి గురై బోరున విలపించారు. సుదర్శన్‌రెడ్డితో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న కేసీఆర్‌ సైతం భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం పెద్ది కుమారుడు నిదర్శన్‌రెడ్డి, కుమార్తె ధర్మిష్ఠకు రూ.కోటి చొప్పున, సుదర్శన్‌రెడ్డి తల్లి అమృతమ్మకు రూ.25 లక్షల చొప్పున చెక్కులు అందించారు. మొత్తం రూ.2.25 కోట్ల ఆర్థిక సాయం అందించారు. కుటుంబ సభ్యులతో సుమారు 45 నిమిషాల పాటు ముచ్చటించారు. సాయంత్రం 4.35 గంటలకు నల్లబెల్లి నుంచి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. అనంతరం మడికొండలోని సత్యసాయి కన్వెన్షన్‌ సెంటర్‌లో వేలాది మంది కార్యకర్తలతో కలిసి భోజనం చేశారు. పార్టీ సీనియర్‌ నేత కెప్టెన్‌ లక్ష్మీకాంతారావుతో పాటు ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. అనంతరం ఎర్రవెల్లి నివాసానికి తిరుగు ప్రయాణమయ్యారు. కేసీఆర్‌ వెంట మండలి డిప్యూటీ చైర్మన్‌ బండా ప్రకాశ్‌, మాజీ స్పీకర్‌ మధుసూదనాచారి, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, రెడ్యానాయక్‌, మాజీ ఎంపీలు వినోద్‌కుమార్‌, మాలోత్‌ కవిత, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు.

సంతాప సభ ఏర్పాట్లపై ఆరా

నల్లబెల్లిలో సోమవారం నిర్వహించనున్న పెద్ది సంతాప సభ ఏర్పాట్లపై మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్‌ మాట్లాడారు. కేసీఆర్‌ పర్యటన సందర్భంగా డీసీపీ రవీందర్‌రెడ్డి, నర్సంపేట రూరల్‌ సీఐ సాయి రమణ పర్యవేక్షణలో నల్లబెల్లి ఎస్సై సాయి ప్రసన్నకుమార్‌తో పాటు ఏడుగురు ఎస్సైలు, 200 మంది పోలీసులు బందోబస్తు నిర్వర్తించారు.

నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి దశదినకర్మకు మాజీ సీఎం హాజరు

చిత్రపటం వద్ద నివాళి..

పెద్ది స్వప్నను పరామర్శించి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా

రూ.2.25 కోట్ల చెక్కులను కుటుంబ సభ్యులకు అందించిన మాజీ సీఎం

ప్రముఖుల పరామర్శ..

మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, సిరికొండ మధుసూదనాచారి, జీవన్‌రెడ్డి, తాటికొండ రాజయ్య, బీఆర్‌ఎస్‌ నాయకులు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, బోయినపల్లి వినోద్‌కుమార్‌, వినయ్‌భాస్కర్‌, అరూరి రమేశ్‌, బండా ప్రకాశ్‌, డీఎస్‌ రెడ్యానాయక్‌, మాలోత్‌ కవిత, శంకర్‌నాయక్‌, నన్నపునేని నరేందర్‌, గండ్ర జ్యోతి, ఎర్రోళ్ల శ్రీనివాస్‌, హరిరమాదేవి, సాంబారి సమ్మారావు, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తదితరులు పెద్ది కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement