
ఆర్ట్స్ కళాశాల డిగ్రీ సెమిస్టర్ల పరీక్షల ఫలితాల విడుదల
కేయూ క్యాంపస్: హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల (అటానమస్)లో బీఏ, బీకాం, బీఎస్సీ డిగ్రీ మొదటి, రెండు, ఐదో (బ్యాక్లాగ్) సెమిస్టర్ పరీక్షల ఫలితాలను ఆదివారం ఆ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.జ్యోతి విడుదల చేశారు. ఈ పరీక్షలకు మొత్తం 1,014మంది విద్యార్థులు హాజరుకాగా అందులో 355మంది (35శాతం)ఉత్తీర్ణులయ్యారని ప్రిన్సిపాల్ జ్యోతి తెలిపారు. ఫలితాల విడుదల కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ రెహమాన్, ఆ కళాశాల పరీక్షల నియంత్రణాధికారి సుధీర్, అధ్యాపకులు గిరిప్రసాద్, శ్రీదేవి, నహిదాపర్వీన్, జితేందర్,రమేశ్ తదితరులు పాల్గొన్నారు.