
ఎన్నికల హామీలు నెరవేర్చండి
● ఈ నెల 13న హైదరాబాద్లో మహాగర్జన
● పద్మశ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదిగ
హసన్పర్తి: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నేరవేర్చాలని పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. హసన్పర్తి మండలం చింతగట్టు క్యాంప్ సమీపంలోని ఎంటీఆర్ గార్డెన్లో దివ్యాంగులు, వృద్ధులు, వితంతువుల పింఛన్దారుల సన్నాహాక సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ఈసమావేశానికి మంద కృష్ణమాదిగ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆగస్టు మొదటి వారంలోగా 15 డిమండ్లు నెరవేర్చాలన్నారు.
13న మహాగర్జన
ఎన్నికల్లో ఇచ్చిన మేరకు హామీలు పరిష్కరించకపోతే ఈనెల 13న హైదరాబాద్లో లక్షలాది మందితో ఎల్బీ స్టేడియంలో మహాగర్జన సభ నిర్వహిస్తామన్నారు. ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు గద్దల సుమార్ అధ్యక్షతన జరిగిన ఈసమావేశంలో ఎంపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు విశ్వనాథ్, హనుమకొండ జిల్లా ఇన్చార్జ్ సోమన్న, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు బండారి సురేందర్, ఎంఎస్పీ రాష్ట్ర నాయకులు పుట్ట రవి, ఆరెపల్లి పవన్, రాజారపు భిక్షపతి, వికలాంగుల సంఘం నేతలు పాల్గొన్నారు.