నిత్యం సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి పెట్టి ప్రజల జీవితాలను మార్చిన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి. తొలుత వైద్యుడిగా పేదల బాధలను చూశారు... తర్వాత నాయకుడిగా ప్రజల సమస్యలను విన్నారు... అధికారంలోకి వచ్చిన తర్వాత వాటికి పరిష్కారం చూపించాలనే తపనతో పాలించారు. బుధవారం ఆయన వర్ధంతి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగారని కొనియాడారు. అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందించిన ఆయన సేవలను స్మరించుకున్నారు. రాజన్నా.. నిను మరువలేమన్నా.. అంటూ మహానేతను మరోసారి గుర్తుచేసుకున్నారు.
– సాక్షి నెట్వర్క్
ప్రత్తిపాడులో వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పిస్తున్న వైఎస్సార్ సీపీ సమన్వయకర్త బలసాని కిరణ్కుమార్, నియోజకవర్గ పరిశీలకుడు షేక్ గులాం రసూల్, నాయకులు


