మరుగుదొడ్ల ఆవశ్యకతపై అవగాహన కల్పించండి | - | Sakshi
Sakshi News home page

మరుగుదొడ్ల ఆవశ్యకతపై అవగాహన కల్పించండి

Nov 21 2025 7:25 AM | Updated on Nov 21 2025 7:25 AM

మరుగుదొడ్ల ఆవశ్యకతపై అవగాహన కల్పించండి

మరుగుదొడ్ల ఆవశ్యకతపై అవగాహన కల్పించండి

గుంటూరు వెస్ట్‌: మరుగుదొడ్ల ఆవశ్యకతను ప్రతి ఒక్కరికీ తెలియజేయాలని జిల్లా కలెక్టర్‌ ఎ.తమీమ్‌ అన్సారియా అన్నారు. వరల్డ్‌ టాయిలెట్స్‌ డే సందర్భంగా జిల్లా పారిశుద్ధ్య కమిటీ రూపొందించిన పోస్టర్‌ను గురువారం కలెక్టర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బహిరంగ మలవిసర్జన జరగరాదని చెప్పారు. గ్రామీణ నీటి సరఫరా విభాగం పర్యవేక్షక ఇంజినీర్‌ కె.కళ్యాణ చక్రవర్తి మాట్లాడుతూ శుక్రవారం నుంచి డిసెంబర్‌ 5వ తేదీ వరకు మరుగుదొడ్ల మరమ్మతులు, ఇతర నిర్వహణ కార్యక్రమాలు ఉంటాయన్నారు. డిసెంబర్‌ 6 నుంచి 9 వరకు మరుగుదొడ్ల సుందరీకరణ ఆవశ్యకత సర్వే చేస్తామన్నారు. అదే నెల 10న ముగింపు మరియు మరుగుదొడ్ల చక్కటి నిర్వహణ, సుందరీకరణకు అవార్డుల బహూకరణ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement