అఖండ హనుమాన్‌ చాలీసా పారాయణం | - | Sakshi
Sakshi News home page

అఖండ హనుమాన్‌ చాలీసా పారాయణం

Apr 23 2024 8:20 AM | Updated on Apr 23 2024 8:20 AM

లబ్బీపేట(విజయవాడతూర్పు): గుంటూరు జిల్లా పెనుమాకలోని వైష్ణవ మహా దివ్య క్షేత్రం ప్రాంగణంలో మంగళవారం నుంచి ఏడాది పాటు (365 రోజులు) అఖండ హనుమాన్‌ చాలీసా పారాయణ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు క్షేత్రం కార్యదర్శి దూపుగుంట్ల శ్రీనివాసరావు తెలిపారు. లోక కళ్యాణార్థం నిర్వహించే ఈ కార్యక్రమంలో భక్తులు పెద్దఎత్తున పాల్గొనాలని ఆయన కోరారు. విజయవాడ ఎంజీ రోడ్డులోని ఓ హోటల్‌లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్‌ మాజేటి వెంకట దుర్గాప్రసాద్‌, దూపుగుంట్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ నెల 23 చైత్రమాస పౌర్ణమి నుంచి 365 రోజుల పాటు దివ్యక్షేత్ర ప్రాంగణంలో హనుమాన్‌ చాలీసా పారాయణం జరుగుతుందన్నారు. తొలిరోజు ఉదయం 7 గంటలకు హనుమత్‌ వైభవ శోభాయాత్ర కనుల పండువగా నిర్వహిస్తామని చెప్పారు. ఉదయం 8 గంటలకు శ్రీ హనుమత్‌ విగ్రహ స్థాపన, 8.30కు హనుమత్‌ ఇష్టి ఉంటుందని తెలిపారు. కార్యసిద్ది హనుమాన్‌ మందిర నిర్వహణ కమిటీ చైర్మన్‌ తాడికొండ శ్రీనివాసరావు, ఘట్టా ధనప్రసాదరావు, ఉమామహేశ్వరగుప్తా, సూర్యప్రకాశరావు, మురళీరావు, భావన్నారాయణ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement