హైదరాబాద్లోని ప్రముఖ ప్రభుత్వ ఆసుపత్రి ‘ఉస్మానియా జనరల్ హాస్పిటల్’ (Osmania General Hospital) వైద్య బృందం దేశంలోనే అత్యంత అరుదైన, సరికొత్త రికార్డును సృష్టించింది. ఏకబిగిన 36 గంటల పాటు శ్రమించి ఒకేసారి ఒక రోగికి అయిదు రకాల శస్త్రచికిత్సలను (Organ Transplants) విజయవంతంగా నిర్వహించారు.
ఈ అసాధారణ విజయాన్ని సాధించిన ఉస్మానియా వైద్యులు, నర్సింగ్, ఇతర సహాయక సిబ్బందికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ మేరకు సిరిసిల్ల జిల్లాకు చెందిన 30 ఏళ్ల యువ ఇంజనీర్కు జీర్ణాశయం, డ్యూడెనమ్, ప్యాంక్రియాస్, చిన్నపేగు, పెద్దపేగు అవయవాలను ఒకేసారి మార్పిడి చేసి దేశంలోనే అరుదైన వైద్య ఘనతను సాధించారు ఉస్మానియా వైద్యులు. మరిన్ని వివరాలకు ఈ కింద లింక్పై క్లిక్ చేయండి.
(చదవండి: ఎవరీ డాక్టర్ ల్యుడ్మిలా ఖోఖ్లోవా? రష్యాలో భారత్ గురించి..)


