శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు: శ్రీనివాసుని వైభోగం చూద్దాం రారండి! | lord sri venkateswara swamy vaibhogam special story | Sakshi
Sakshi News home page

శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు: శ్రీనివాసుని వైభోగం చూద్దాం రారండి!

Oct 7 2024 10:01 AM | Updated on Oct 7 2024 10:12 AM

lord sri venkateswara swamy vaibhogam special story

శ్రీవారి  బ్రహ్మోత్సవాలు అక్టోబరు 04, శుక్రవారం వైభవంగా ఆరంభమయ్యాయి. ఇవి 12వ తేదీ, శనివారం వరకు జరగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వైశిష్ట్యం ఇలా... 

 

బంగారు తిరుచ్చి ఉత్సవం: అక్టోబర్‌ 4, శుక్రవారం ఉదయం శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజు ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారు బంగారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు.

సాయంత్రం ధ్వజారోహణం:  సాయంత్రం 5.45కు ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు  ప్రాంరంభమయ్యాయి. 

7 – సోమవారం ఉదయం: కల్పవృక్ష వాహనం: నాలుగోరోజు ఉదయం స్వామి ఉభయ దేవేరులతో కలిసి కల్పవృక్ష వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి దర్శనమిస్తారు. కల్పవృక్ష వాహన దర్శనం వరాలను అనుగ్రహిస్తుంది.

రాత్రి: సర్వభూపాల వాహనం... సర్వభూపాల అంటే విశ్వానికే రాజు అని అర్థం. అంటే శ్రీవారు సకల దిక్పాలకులకు రాజాధిరాజని భావం. దిక్పాలకులందరూ స్వామివారిని హృదయంలో ఉంచుకుని సేవిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారనే సందేశాన్ని ఇస్తున్నారు.

8 – మంగళవారం ఉదయం మోహినీ అవతారం: ఐదోరోజు ఉదయం మోహినీరూపంలో దర్శనమిస్తారు. పక్కనే స్వామి దంతపు పల్లకిపై వెన్నముద్ద కృష్ణుడై మరో రూపంలో అభయమిస్తాడు. తనకు భక్తులైనవారు మాయను సులభం గా దాటగలరని స్వామి ప్రకటిస్తున్నాడు.

సాయంత్రం గరుడ వాహనం: ఐదో రోజు రాత్రి గరుడవాహనంలో ఊరేగుతూ భక్తులందరికీ తన దివ్యమంగళ రూపదర్శనమిస్తారు. గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయి.

9 – బుధవారం ఉదయ: హనుమంత వాహనం: ఆరోరోజు ఉదయం శేషాచలాధీశుడు రాముని అవతారంలో హనుమంతునిపై ఊరేగి భక్తులకు దర్శనమిస్తాడు. ఈ ఇరువురినీ చూస్తే వేదాల తత్త్వం ఒనగూరుతుంది.

సాయంత్రం 4 గంటలకు స్వర్ణరథం: ఆరోరోజు సాయంత్రం స్వామి స్వర్ణరథాన్ని అధిరోహించి అనుగ్రహిస్తాడు. స్వర్ణోత్సవ సేవలో కల్యాణకట్ట సేవాపరులు బంగారు గొడుగును అలంకరించడం సంప్రదాయం. 

రాత్రి 7 గంటలకు గజవాహనం... ఆరోరోజు రాత్రి వేంకటాద్రీశుడు గజవాహనంపై భక్తులకు అభయ మిస్తాడు. భక్తులు శ్రీనివాసుని హృదయంలో పెట్టుకుని శరణాగతి చెందాలని తెలుస్తోంది.

10 – గురువారం ఉదయం సూర్యప్రభ వాహనం: ఏడోరోజున ఉదయం సూర్యప్రభ వాహనంపై  తిరుమాడవీధులలో విహరిస్తూ భక్తులను కటాక్షిస్తారు. సూర్యప్రభ వాహనంపైన దర్శనం వల్ల ఆరోగ్యం, విద్య, ఐశ్వర్యం, సంతానం సిద్ధిస్తాయి.

రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనం: ఏడో రోజు రాత్రి స్వామి చంద్రప్రభ వాహనం పై విహరిస్తారు. ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆది దైవికమనే మూడు తాపాలను ఇది నివారిస్తుంది.

11 – శుక్రవారం ఉదయం: శ్రీవారి రథోత్సవం: ఎనిమిదో రోజు ఉదయం ఉభయదేవేరులతో కూడిన స్వామి రథోత్సవం జరుగుతుంది.
రాత్రి 7 గంటలకు అశ్వవాహనం: ఎనిమిదో రోజు రాత్రి శ్రీమలయప్పస్వామివారు అశ్వవాహనంపై విహరించి భక్తులను అనుగ్రహిస్తాడు. స్వామి అశ్వవాహనారూఢుడై కల్కి అవతారంలో తన స్వరూ΄ాన్ని ప్రకటిస్తూ భక్తులను కలిదోషాలకు దూరంగా ఉండాలని ప్రబోధిస్తున్నాడు.

12 – శనివారం ఉదయం 6 గంటలకు చక్రస్నానం: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో చివరిదైన తొమ్మిదో రోజు ఉదయం చక్రస్నానం జరుగుతుంది. ముందుగా ఉభయదేవేరులతో కలిసి శ్రీవారి సరసన ఉన్న చక్రత్తాళ్వార్లకు ΄ాలు, పెరుగు, నెయ్యి, తేనె, చందనంతో అర్చకులు అభిషేకం చేస్తారు. ఈ అభిషేక కైంకర్యాన్ని అందుకుని చక్రత్తాళ్వార్‌ ప్రసన్నుడవుతాడు. చక్రస్నానం సమయంలో పుష్కరిణిలో స్నానం చేసిన వారు యజ్ఞఫలాన్ని  పొందుతారని ప్రతీతి..

రాత్రి 7 గంటలకు ధ్వజావరోహణం:  శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో చివరిదైన తొమ్మిదో రోజు రాత్రి బంగారు తిరుచ్చి ఉత్సవం తరువాత ధ్వజావరోహణం శాస్త్రోక్తంగా జరుగుతుంది. ధ్వజావరోహణ ఘట్టంతో తొమ్మిది రోజుల పాటు జరిగిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
లక్ష్మీకాంత్‌ ఆలిదేనా, సాక్షి, తిరుమల

Advertisement
 
Advertisement
Advertisement