ముద్రా రుణమంటూ సైబర్‌ మోసం | - | Sakshi
Sakshi News home page

ముద్రా రుణమంటూ సైబర్‌ మోసం

Jan 5 2026 10:53 AM | Updated on Jan 5 2026 10:53 AM

ముద్రా రుణమంటూ సైబర్‌ మోసం

ముద్రా రుణమంటూ సైబర్‌ మోసం

మిర్చికి కొత్త క్రేజ్‌ ముద్రా రుణమంటూ సైబర్‌ మోసం

మిర్చికి కొత్త క్రేజ్‌
వేలేరుపాడు మండలం నడిమిగొమ్ము గ్రామంలో ఓ యువ రైతు సాగు చేసిన రంగురంగుల మిర్చి ఆకట్టుకుంటోంది. మంచి దిగుబడి వచ్చింది. 8లో u

రూ.2.50 లక్షలకు టోకరా

తణుకు అర్బన్‌: తణుకులో ముద్రా రుణం మంజూరైందని వచ్చిన ఫోన్‌కాల్‌కు ఆశపడి ఓ మహిళ రూ.2.50 లక్షల ను సైబర్‌ నేరగాళ్లకు స మర్పించుకున్న వ్యవహారం వెలుగులోకి వ చ్చింది. వివరాల్లోకి వెళితే.. తణుకు పాత పోలీస్‌స్టేషన్‌ వీధిలో సిద్ధార్థ కర్రీ పాయింట్‌ (పంతులు కర్రీ పాయింట్‌) ద్వారా ఉపాధి పొందుతున్న మహిళ సూరికుర్చి లక్ష్మికి కొంతకాలం క్రితం వచ్చిన ఫోన్‌ కాల్‌లో మీకు రూ.5 లక్షలు ముద్ర లోన్‌ మంజూరైనట్లు సైబర్‌ నేరగాడు నమ్మించాడు. తాను హైదరాబాద్‌ బేగంపేటలోని ఆఫీసులో ఉంటానని తన పేరు అరు ణ్‌గా పరిచయం చేసుకున్నాడు. రుణం కావాలంటే ముందుగా ఫీజు, ఇతర రుసుముల కింద రూ.50 వేలు చెల్లించాలని నమ్మించాడు. అతడి మాటలు నమ్మిన లక్ష్మి పలు దఫాలుగా రూ.2.50 లక్షలు ఆన్‌లైన్‌ పేమెంట్‌ యాప్‌ల రూపంలో చెల్లించింది. త్వరలో రూ.7.50 లక్షలు ఇస్తామని చెప్పి చివరగా మరో రూ.50 వేలు చెల్లించాలనడంతో ఆమె నిరాకరించింది. తర్వాత ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా సైబర్‌ మోసగాడు లిఫ్ట్‌ చేయకపోవడంతో బాధితురాలు హైదరాబాద్‌ వెళ్లినా అక్కడ ఎవరూ సమాధానం చెప్పలేదు. దీంతో ఆమె ఆదివారం తణుకులో పోలీసులను ఆశ్రయించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement