ఈవీ.. పట్టించుకోరేమీ? | - | Sakshi
Sakshi News home page

ఈవీ.. పట్టించుకోరేమీ?

Jan 4 2026 10:54 AM | Updated on Jan 4 2026 10:54 AM

ఈవీ.. పట్టించుకోరేమీ?

ఈవీ.. పట్టించుకోరేమీ?

నూజివీడు: పట్టణంలోని ఇరుకు సందుల్లో నుంచి చెత్తను సేకరించి డంపింగ్‌ యార్డుకు తరలించేందు కు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అందించిన ఈ వీ ఆటోలు మూలకు చేరాయి. క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ (క్లాప్‌)లో భాగంగా అందించిన ఆరు ఈవీ ఆటోలు మున్సిపాలిటీ అలసత్వం, నిర్వహణలోపం కారణంగా మరమ్మతులకు గురవడంతో పక్కన పెట్టేశారు. బ్యాటరీలు పనిచేయకపోవడంతో అ లాగే వదిలేశారు. సప్లయి చేసిన కంపెనీ సైతం సర్వీసు అందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా అడిగే నాథుడే కరువయ్యాడు. వీటికి చార్జింగ్‌ ఎక్కుతున్నా వాహనం కదలడం లేదంటూ గాంధీపార్కు పక్కనే ఉన్న మీసేవా కేంద్రం భవనం ఆవరణలో పెట్టారు. విద్యుత్‌ ద్వారా నడిచే ఈ వాహనాల ద్వారా మున్సిపాలిటీపై ఆర్థిక భారం తగ్గుతుంది. వీటిని రన్నింగ్‌లో పెట్టకపోవడంపై పలువురు కౌన్సిలర్లు విస్మ యం వ్యక్తం చేస్తున్నారు. వీటిని వినియోగంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement