ఉత్తమ వర్జీనియా రైతుగా షేక్ బాజీ
కొయ్యలగూడెం: మండలంలోని కన్నాపురానికి చెందిన షేక్ బాజీ ఉత్తమ వర్జీనియా రైతు అవార్డును అందుకున్నారు. గుంటూరులో శుక్రవారం జరిగిన పొగాకు బోర్డు గోల్డెన్ జూబ్లీ వార్షికోత్సవంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విశ్వశ్రీ, వేలం డైరెక్టర్ బి.శ్రీనివాస్, కార్యదర్శి డి.వేణుగోపాల్ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా బాజీ మాట్లాడుతూ వర్జీనియా పొగాకు పండించడంలో ఉత్తమ పనితీరు కనబరిచిన రైతులను పొగాకు బోర్డు సత్కరించి, అవార్డులు అందిస్తుందన్నారు.
కొయ్యలగూడెం: సెంట్రల్ ఎకై ్సజ్ సవరణ చట్టం 2025 ద్వారా పొగాకు ఉత్పత్తులపై భారీగా పన్నులు పెంచడంపై రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం జాతీయ ప్రధాన రహదారిపై ఎఫ్ఏఐఎఫ్ఏ నాయకులు రైతులు ఆందోళన నిర్వహించారు. ఇప్పటికే ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయం తగ్గడం, దేశీయ మార్కెట్లో ధరలు స్ధిరంగా ఉండటం, సాగు ఖర్చులు పెరగడం, నియంత్రణ కారణంగా సాగు విస్తీర్ణం తగ్గిపోవడంతో రైతులు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారన్నారు. ఈ క్రమంలో అధిక పన్నులు రైతుల ఆదాయంపై ప్రభావం చూపడంతో పాటు, అక్రమ వ్యాపారం పెరుగుతుందన్నారు.
ఉత్తమ వర్జీనియా రైతుగా షేక్ బాజీ


