చాగల్లు: దివంగత మాజీ ఎమ్మెల్యే కృష్ణబాబుకు సమాజంపై ఎంతో బాధ్యత ఉందని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు. కొవ్వూరు మండలం దొమ్మేరు గ్రామంలో, కొవ్వూరు గామన్ బ్రిడ్జి కూడలి వద్ద ఆదివారం కృష్ణబాబు విగ్రహాలను ఆవిష్కరించారు. స్పీకర్తో పాటు, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, మంత్రి దుర్గేష్, తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సీనియర్ నేత, ఎమ్మెల్సీ కేవీపీ రామచంద్రరావు తదితరులు హాజరయ్యారు. దొమ్మేరులో విగ్రహాన్ని మంత్రి తుమ్మల ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వక్తలు ఆయన సేవలను కొనియాడారు.


