రూ.7 కోట్ల విలువైన భూమి వితరణ | - | Sakshi
Sakshi News home page

రూ.7 కోట్ల విలువైన భూమి వితరణ

Aug 20 2026 7:44 AM | Updated on Aug 20 2026 7:44 AM

రాజమహేంద్రవరం రూరల్‌: హుకుంపేట గ్రామానికి చెందిన స్వర్గీయ సత్యవోలు పాపారావు చిన్న కోడలు వడ్డాది గౌరి హుకుంపేటలో 33/11 కేవీ విద్యుత్‌ ఉపకేంద్రం నిర్మాణానికి సుమారు రూ.7 కోట్ల విలువైన 2,400 చదరపు గజాల స్థలాన్ని విరాళంగా అందజేశారు. ఈపీ డీసీఎల్‌ పర్యవేక్షక ఇంజినీర్‌ కె. తిలక్‌ కుమార్‌, రాజమహేంద్రవరం టౌన్‌ డివిజన్‌ కార్యనిర్వహక ఇంజినీర్‌ నక్కపల్లి శామ్యూల్‌ ప్రతిపాదన మేరకు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, హుకుంపేట గ్రామానికి చెందిన వల్లేపల్లి సుబ్రహ్మణ్యం అభ్యర్థన మేరకు ఈ స్థలాన్ని వితరణ చేశారు. ఈ మేరకు బుధవారం కడియం సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ చేసి ఈఈ శామ్యూల్‌కు గౌరి సదరు పత్రాలను అందజేశారు. ఈ మేరకు దాత గౌరికి సీఎండీ పృథ్వీతేజ్‌ కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement