ఐదో రోజుకు చేరిన రిలే దీక్షలు | - | Sakshi
Sakshi News home page

ఐదో రోజుకు చేరిన రిలే దీక్షలు

Aug 11 2026 12:18 AM | Updated on Aug 11 2026 12:18 AM

రాజానగరం: తమకు ఉద్యోగ భద్రత కల్పించే వరకు దీక్షలను విరమించేది లేదని సోమవారం ఆదికవి నన్నయ యూనివర్సిటీ నాన్‌ టీచింగ్‌ (ఔట్‌సోర్సింగ్‌) సిబ్బంది స్పష్టం చేశారు. యూనివర్సిటీ ముఖద్వారం వద్ద వారు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఐదో రోజుకు చేరుకున్నాయి. ఈ క్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ ఆచార్య కేవీ స్వామి, రాజమహేంద్రవరం ఆర్డీఓ శివరాముడు, రాజానగరం తహసీల్దార్‌ దివ్యభారతి, డీఎస్పీ జీవన సోమవారం దీక్ష శిబిరాన్ని సందర్శించారు. దీక్షలను విరమింపజేసేందుకు వారితో జరిపిన చర్చలు సఫలీకృతం కాలేదు. ఈ సమయంలో దీక్షాపరులు తమ సమస్యలను అధికారులకు వివరించారు. 20 ఏళ్ల నుంచి తాము చాలీచాలని వేతనాలతో విధులు నిర్వహిస్తున్నామని, ఈ సమయంలో కాంట్రాక్టు పద్ధతిలో కొత్తవారిని నియమించే విధంగా టెండర్‌ నోటీసు జారీ చేయడం బాధాకరమన్నారు. తక్షణమే టెండర్‌ నోటీసును వెనక్కి తీసుకుని, తమ ఉద్యోగాలను రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. అప్పటివరకు ఈ దీక్షలను విరమించేది లేదన్నారు. చర్చల్లో నాన్‌ టీచింగ్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు నాగారపు విజయబాబు, జనరల్‌ సెక్రటరీ వై.వీరభద్రచౌదరి, తదితరులు పాల్గొన్నారు.

ఉన్నతాధికారులతో చర్చలు విఫలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement