● 241 గ్రాముల
బంగారు ఆభరణాల స్వాధీనం
● జీఆర్పీ డీఎస్పీ ప్రమోద్
రాజమహేంద్రవరం సిటీ: రైళ్లలో చోరీలకు పాల్పడుతున్న పశ్చిమ బెంగాల్కు చెందిన అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యులు ఐదుగురిని అరెస్ట్ చేసి వారి నుంచి 241 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్టు స్థానిక జీఆర్పీ డీఎస్పీ కె.ప్రమోద్ తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ ఏడాది ఏప్రిల్, జూలై నెలల్లో నమోదైన రెండు హ్యాండ్బ్యాగ్ చోరీ కేసులలో దర్యాప్తు అనంతరం వీరిని పట్టుకున్నట్టు తెలిపారు.


