కేతుగ్రస్త చంద్రగ్రహణం కారణంగా జిల్లాలోని ఆలయాలను మంగళవారం మూసివేశారు. ఉదయం నిత్య కై ంకర్యాలు, దర్శనాల అనంతరం ఆలయాలకు తాళాలు వేశారు. దర్శనాలను నిలిపివేయడంతో నిత్యం భక్తులతో కిటకిటలాడే అన్నవరప్పాడు వేంకటేశ్వరస్వామి, తిమ్మరాజుపాలెంలోని కోటసత్తెమ్మ అమ్మవారి ఆలయాల్లో సందడి తగ్గింది. సంప్రోక్షణ, నిత్య పూజలు నిర్వహించి బుధవారం ఉదయం యథావిధిగా భక్తులను దర్శనాలకు అనుమతిస్తారు. రాయవరం మండలంలోని వెదురుపాక విజయదుర్గా పీఠంలో చంద్రగ్రహణ సమయంలో హోమం నిర్వహించారు.
– సాక్షి నెట్వర్క్


