
తెలంగాణ వలస కూలీ అదృశ్యం
అమలాపురం టౌన్: తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ప్రాంతానికి చెందిన పాలత్య సుభాష్ అమలాపురం పట్టణానికి కూలీ పనుల కోసం వలస వచ్చి ఈ నెల 17న అదృశ్యమయ్యాడు. ఈ మేరకు శంషాబాద్ నుంచి అతని భార్య సరోజ అమలాపురానికి శనివారం వచ్చి తన భర్త అదృశ్యంపై పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పి.వీరబాబు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... 29 ఏళ్ల సుభాష్ అమలాపురంలో వలస కూలీగా జీవిస్తున్నాడు. 17వ తేదీన తాను పనిచేసే చోట కూలీ డబ్బులు తీసుకుని మా ఊరు వెళుతున్నానని చెప్పి వెళ్లాడు. అప్పటి నుంచి అతడి ఆచూకీ లేకుండా పోయింది. దీంతో అతని భార్య స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. 5.6 అడుగుల ఎత్తుతో ఉండే ఇతని ఆచూకీ తెలిస్తే పట్టణ పోలీస్ స్టేషన్లో 08856–231033, తన నంబర్ 9440796561కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సీఐ విజ్ఞప్తి చేశారు.