● ఇక దగ్గర పంటుగే
● యమడేంజరే మరి
● పూత వేసి.. కనువిందు చేసి
హెల్మెట్ ధరిస్తారా.. నా దగ్గరకు వస్తావా అంటూ వాహనదారులను యమ ధర్మరాజు వేషధారణలో ఓ కళాకారుడు హెచ్చరిస్తూ, రోడ్డు ప్రమాదాల నివారణపై చేపట్టిన అవగాహన కార్యక్రమం ఆకట్టుకుంది. జిల్లా ఎస్పీ బింధుమాధవ్ ఆదేశాలతో స్థానిక సీఐ వైఆర్కే శ్రీనివాస్ ఆధ్వర్యంలో కళాకారులు యమ ధర్మరాజు, చిత్రగుప్తుడు వేషధారణతో జగ్గంపేట ప్రధాన రోడ్డుపై ప్రజలల్లో ఇలా అవగాహన నింపారు.
– జగ్గంపేట
మామిడికి పూత వచ్చేసింది.. ఆ చెట్లకు కళ తెచ్చింది.. పాశర్లపూడిబాడవలోని 216 జాతీయ రహదారి పక్కన ఉన్న నిమ్మల అప్పారావు ఇంటి ప్రాంగణంలో మామిడిచెట్టు ఇలా పూత పూసింది. చెట్టుకు ఉన్న ఆకుల కన్నా పూతతో నిండుగా కనిపిస్తోంది. ఆ మార్గంలో వెళ్లే ప్రతి ఒక్కరికీ కనువిందు చేస్తోంది. దేశవాళీ రకానికి చెందిన ఈ మామిడి చెట్టు ప్రతి ఏడాది ఇదే విధంగా పూత పూసి కాయలు కాస్తోందని అప్పారావు తెలిపారు.
– మామిడికుదురు
కోటిపల్లి – ముక్తేశ్వరం మధ్య పంటు ప్రయాణం సోమవారం నుంచి పునః ప్రారంభించారు. ఈ ఏడాది జూలైలో గోదావరికి వరదల కారణంగా మూతపడింది. అప్పటి నుంచి అమలాపురం వెళ్లాల్సిన ప్రయాణికులు సుమారు 54 కిలోమీటర్ల రోడ్డు మార్గంలో వెళ్లేవారు. పంటు ప్రయాణం ప్రారంభించడంలో కేవలం 15 కిలోమీటర్లు వెళ్తే సరిపోతుందని ఆనందిస్తున్నారు.
– కె.గంగవరం
● ఇక దగ్గర పంటుగే
● ఇక దగ్గర పంటుగే


