వందేళ్ల వృద్ధురాలి కన్నుమూత
నల్లజర్ల: ప్రకాశరావుపాలెంలో వృద్ధురాలు గోగులమండ సుందరమ్మ(100) బుధవారం ఉదయం కన్నుమూశారు. మరణించే వరకూ ఆమె ఆరోగ్యంగానే ఉన్నారని బంధువులు తెలిపారు. ఆమెకు ఐదుగురు మగ, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. నలుగురు కుమారులు వివిధ శాఖల్లో గెజిటెడ్ హోదాల్లో పనిచేస్తున్నారు. నాలుగో కుమారుడు గోగుల మండబాబ్జీ వైఎస్సార్ సీపీ లీగల్సెల్ మండల అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఆమె భర్త వీరాస్వామి కమ్యూనిస్టు ఉద్యమ నేతగా వ్యవహరించారు.
మహిళ మెడలో గొలుసు చోరీ
కొవ్వూరు: ఈవెనింగ్ వాకింగ్ చేస్తున్న మహిళ మెడ నుంచి బంగారు గొలుసును దొంగ అపహరించిన ఉదంతమిది. పట్టణంలోని 23వ వార్డుకు చెందిన కుందుల పద్మకుమారి స్థానిక బైపాస్ రోడ్డు బుధవారం ఈవెనింగ్ వాకింగ్కు బయలుదేరింది. మోటార్ బైక్పై వచ్చిన దొంగ ఆమె మెడలో ఉన్న ఆరున్నర కాసుల బంగారు గొలు సును తెంచుకుని పరారయ్యాడు. సమాచారం అందుకున్న డీఎస్పీ జి.దేవకుమార్, పట్టణ సీఐ పి.విశ్వం సంఘటన స్థలానికి చేరుకుని, బాధితు రాలి నుంచి వివరాలు సేకరించారు. ఆమె ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేశామని సీఐ విశ్వం తెలిపారు. గతంలో కొవ్వూరు పట్టణంలో రెండు చైన్ స్నాచింగ్ సంఘటనలు చోటుచేసుకున్నాయి.
23న జాతీయ సాహిత్య సదస్సు
సఖినేటిపల్లి: మహాకవి, పద్మభూషణ్ బోయి భీమన్న జీవితం, సాహిత్యంపై ఈ నెల 23న రాజమహేంద్రవరంలో జాతీయ సాహిత్య సదస్సు నిర్వహిస్తున్నట్టు శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ సీఈఓ కత్తిమండ ప్రతాప్ బుధవారం ఇక్కడ తెలిపారు. ఆ సదస్సులో వంద మంది కవులు పత్ర సమర్పణ చేయనున్నట్టు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ఈ సదస్సు ఏర్పాటు చేశామన్నారు. ముఖ్యఅతిథిగా బోయి భీమన్న సతీమణి బోయి హైమవతి హాజరవుతారని తెలిపారు. సదస్సులో పాల్గొనే కవులందరినీ సత్కరిస్తామని చెప్పారు.
వందేళ్ల వృద్ధురాలి కన్నుమూత


