ఏమైందో ఏమో.. అన్నయ్య విదేశాలకు వెళ్లిపోవడంతో.. | Young Woman Commits Suicide In Srikakulam District | Sakshi
Sakshi News home page

ఏమైందో ఏమో.. అన్నయ్య విదేశాలకు వెళ్లిపోవడంతో..

Aug 14 2022 10:56 AM | Updated on Aug 14 2022 11:03 AM

Young Woman Commits Suicide In Srikakulam District - Sakshi

పైల ఊర్వశి (ఫైల్‌)

అంతర్‌సింగి గ్రామానికి చెందిన ఊర్వశికి తండ్రి చిన్నప్పుడే మరణించారు. అన్నయ్య దగ్గర ఇన్నాళ్లూ ఆమె ఉండేది. ఆయన విదేశాలకు వెళ్లిపోవడంతో ఆమె కాశీబుగ్గలోని ఓ హోటల్‌లో దినసరి కూలిగా పనికి చేరింది.

కాశీబుగ్గ(శ్రీకాకుళం జిల్లా): పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలో శనివారం రాత్రి పైల ఊర్వశి (23) అనే యువతి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాశీబుగ్గ పాత జాతీయ రహదారిలో ఉన్న శ్రీవాసవి టిఫిన్‌ సెంటర్‌లో దినసరి కూలిగా పనిచేస్తున్న పైల ఊర్వశి (23) తాను అద్దెకు ఉన్న ఇంటిలో శనివారం ఉరి వేసుకుంది. ఇచ్ఛాపురం సమీపంలోని అంతర్‌సింగి గ్రామానికి చెందిన ఊర్వశికి తండ్రి చిన్నప్పుడే మరణించారు. అన్నయ్య దగ్గర ఇన్నాళ్లూ ఆమె ఉండేది. ఆయన విదేశాలకు వెళ్లిపోవడంతో ఆమె కాశీబుగ్గలోని ఓ హోటల్‌లో దినసరి కూలిగా పనికి చేరింది. ఏమైందో గానీ శనివారం ఆత్మహత్యకు పాల్పడింది. కాశీబుగ్గ ఎస్‌ఐ సందీప్‌ కుమార్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: జీబ్రాలు నిలబడే  నిద్రపోతాయి.. ఎందుకో తెలుసా?

ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. 
ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement