అద్దెకుంటున్న యువకుడితో పరిచయం.. యువతికి ఫోన్‌ చేసి ఫొటోలు పోస్టు చేస్తానంటూ

Young Man Threatened To Post Photos On Social Media In Vijayawada - Sakshi

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): యువతిని ప్రేమించి తనతో కలిసి దిగిన ఫొటోలు సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరించిన యువకుడిపై భవానీపురం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. భవానీపురానికి చెందిన యువతి నగరంలోని ఓ కళాశాలలో ఇంజినీరింగ్‌ థర్డ్‌ ఇయర్‌ చదువుతోంది. ఆ యువతి కృష్ణలంకలో ఉంటున్న తన పెదనాన్న ఇంటికి వెళ్లగా, అక్కడ అద్దెకు ఉంటున్న అమిత్‌ పరిచయమయ్యాడు. అతని ద్వారా అయనవెల్లి రాజేష్‌ అనే యువకుడు పరిచయమయ్యాడు. గతేడాది అక్టోబర్‌లో వారిద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారింది.
చదవండి: భర్త నిర్వాకం.. ప్రియురాలితో గుట్టుగా కాపురం.. భార్యకు తెలిసి..

ఇద్దరూ కలిసి ఫొటోలు దిగారు. ఆ ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తానంటూ రాజేష్‌ యువతిని బెదిరించి డబ్బులు అడిగాడు. భయంతో ఆమె అతనికి కొంత డబ్బు ఇచ్చింది. అయినప్పటికీ అతని బెదిరింపులు ఆగలేదు. ఈ క్రమంలో రూ.3లక్షల నగదు, రెండు బంగారు ఉంగరాలు ఇచ్చింది. ఇదంతా ఏడాది కాలంగా జరుగుతున్నా యువతి భయంతో ఎవరికీ చెప్పలేదు. గత ఏప్రిల్‌ 27న రాజేష్‌ ఆ యువతికి ఫోన్‌ చేసి ఫొటోలు పోస్టు చేస్తానంటూ మళ్లీ బెదిరించసాగాడు.

ఎవరికీ చెప్పుకోలేక భయపడి ఆమె స్కూటీతో ఆగి ఉన్న లారీని ఢీకొట్టి ఆస్పత్రి పాలైంది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన తర్వాత ఆ యువతి రాజేష్‌ తన ఫొటోలు సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తానంటూ బెదిరించి డబ్బులు తీసుకున్నాడని భవానీపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు రాజేష్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top