నాగార్జునసాగర్: బీమా డబ్బు కోసం చోటుచేసుకున్న దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఆరేళ్ల క్రితం మృతిచెందిన వ్యక్తిది ప్రమాద మరణం కాదని.. హత్యేనని పోలీసుల విచారణలో వెల్లడైంది. బీమా డబ్బుల కోసమే కూతురు, అల్లుడు పథకం ప్రకారం మరికొందరి సహకారంతో ఘాతుకానికి ఒడిగట్టినట్లు తేలింది. సీఐ గౌరీనాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దవూర మండలం కుంకుడుచెట్టుతండాకు చెందిన రమావత్ బిక్నానాయక్(47) కొన్నేళ్ల క్రితం తన కూతురు బుజ్జిని దామరచర్ల మండలం పుట్టల గడ్డతండాకుచెందిన రూపావత్ చీనానాయక్ కుమారుడు భాష్యానాయక్కు ఇచ్చి వివాహం చేశాడు. ప్రస్తుతం తండాకు సర్పంచ్ ఈయనే. అయితే, భాష్యానాయక్ అప్పట్లోనే రమావత్ బిక్నానాయక్పై వివిధ రకాల ఇన్సూరెన్స్ పాలసీలు చేయడంతో పాటు అతడి పేరిట రెండు ట్రాక్టర్లు, బొలేరోను ప్రైవేట్ ఫైనాన్స్లో తీసుకున్నాడు.
పథకం ప్రకారం..
బీమా పాలసీలు, వాహనాలపై ఉన్న ఫైనాన్స్ డబ్బులను చెల్లించకుండా ఉండేందుకు భాష్యానాయక్ మామ బిక్నానాయక్ను అంతమొందించేందుకు తన భార్య బుజ్జితో పథకం రచించాడు. అందుకు కల్లెపల్లికి చెందిన లావుడ్యా రాజేశ్వర్రావు, ధీరావత్ నరేష్, గాంధీనగర్కు చెందిన పోలగాని రవిల సహకారం తీసుకున్నాడు. రమావత్ బిక్నానాయక్కు 2015 ఫిబ్రవరి 22న రాత్రి మద్యం తాపారు. స్పృహకోల్పోయిన తర్వాత నెల్లికల్లు స్టేజీసమీపంలో రోడ్డుపై పడుకోబెట్టి ట్రాక్టర్తో తొక్కించి హత్య చేశారు.
రిమాండ్కు తరలింపు
బిక్నానాయక్ మృతిని భాష్యానాయక్ ప్రమాదంగా చిత్రీకరించి నాగార్జునసాగర్ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అదే తరహాలో పోలీసులు కేసు నమోదు చేశారు. బిక్నానాయక్పై ఉన్న పాలసీలతో రూపావత్ భాష్యానాయక్–బుజ్జిదంపతులు రూ.79,65,000లు లబ్ధిపొందారు. ఇటీవల బీమా సొమ్ము స్వాహాపర్వంలో పొలగాని రవి అరెస్ట్ కావడంతో భాష్యానాయక్ దంపతుల దారుణం కూడా వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు బుధవారం కేసులో నిందితులైన భాష్యానాయక్, బుజ్జి, నాగేశ్వర్రావు, నరేష్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ వివరించారు.
ఆరేళ్ల క్రితం ప్రమాదంలొ చనిపోయినట్లు నాటకం
Published Thu, Mar 11 2021 3:07 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement