విషాదం: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం | Road Accident In Kurnool District Three People Deceased | Sakshi
Sakshi News home page

విషాదం: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం

Dec 2 2020 8:32 AM | Updated on Dec 2 2020 8:42 AM

Road Accident In Kurnool District Three People Deceased - Sakshi

సాక్షి, కర్నూలు: జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. గూడూరు సమీపంలో ఓ కరెంట్ సబ్ స్టేషన్ దగ్గర బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న ట్రాక్టర్, బైక్ పరస్పరం ఢీకొనడంతో  అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకొని మృత దేహాలను స్వాధీనం చేసుకున్నారు. పత్తి తీసేందుకు ట్రాక్టర్‌లో వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించినట్లు పోలీసులు తెలిపారు. మృతులు బ్రాహ్మణ దొడ్డి గ్రామంలోని ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement