ఆ పాప ఊపిరాడక చనిపోయింది

Priest Assaulted Victim in the Past Too, Says Chargesheet - Sakshi

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీలోని కంటోన్మెంట్‌కు చెందిన తొమ్మిదేళ్ల దళిత బాలిక అత్యాచారం, హత్య ఘటనలో పోలీసులు బుధవారం అభియోగాలు నమోదు చేశారు. ఆ బాలికపై లైంగిక దాడి జరిగినప్పుడు ఊపిరాడక చనిపోయిందని కోర్టుకు సమర్పించిన చార్జిషీటులో పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు, పూజారి రాధేశ్యామ్‌ ఆ బాలికపై గతంలోనూ అత్యాచారానికి పాల్పడ్డాడని తమ విచారణలో తేలినట్టుగా పోలీసులు వెల్లడించారు.

శ్మశాన వాటిక సమీపంలో ఉన్న కూలర్‌లో మంచినీళ్లు తాగడానికి వచి్చన ఆ బాలిక అరవకుండా గట్టిగా  నోరు నొక్కి పెట్టి ఉంచిన పూజారి రాధే శ్యామ్‌ ఆమెపై బలవంతంగా అత్యాచారం జరపాడని, దీంతో ఊపిరాడక ఆ బాలిక మరణించిందని పోలీసులు చార్జిషీటులో వివరించారు.  ఎలక్ట్రిక్‌ షాక్‌ తగలడం వల్లే ఆ బాలిక మరణించిందని అతడు ఆమె తల్లిదండ్రుల్ని మభ్య పెట్టాలని చూశాడని, ఆ పాపకి విద్యుతాఘాతం తగిలినట్టుగా ఎలాంటి ఆధారాలు లేవన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top