ఎస్సారెస్పీ కాలువలోకి కారు.. ముగ్గురు మృతి

Jagtial Car Crashes Into SRSP Canal 3 Persons Missing One Drowned - Sakshi

సురక్షితంగా బయటపడ్డ జయంత్‌

సాక్షి, జగిత్యాల: జిల్లాలో సోమవారం ఉదయం దారుణం చోటు చేసుకుంది. మేడిపల్లి మండలం కట్లకుంట వద్ద ఘోర ప్రమాదం జరిగింది. కారు ఎస్సారెస్పీ కెనాల్లోకి దూసుకెళ్లడంతో ముగ్గురు గల్లంతయ్యారు. ఒకరు సురక్షితంగా బయటపడ్డారు. గల్లంతైన వారు కోరుట్ల మండలం జోగినిపల్లికి చెందిన న్యాయవాది అమరేందర్ రావు కుటుంబసభ్యులుగా గుర్తించారు. అమరేందర్ రావు భార్య శిరీషా కూతురు శ్రేయా, కుమారుడు జయంత్ నలుగురు కారులో హైదరాబాద్ వెళ్ళి తిరిగి వస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది.

ముగ్గురు కారుతో సహ గల్లంతయ్యారు. ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డ జయంత్ బయటికి వచ్చి చెప్పేవరకు కారు కెనాల్‌లో పడ్డ విషయం ఎవరికీ తెలియదు. ప్రమాదం గురించి తెలిసిన పోలీసులు, రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని కెనాల్‌లో నీటిని నిలిపివేసి గాలింపు చర్యలు చేపట్టారు. కాలువలో గల్లైంతన అమరేందర్ రావు, ఆయన భార్య శిరీషా, కూతురు శ్రేయా ముగ్గురు మరణించారు. అధికారులు క్రేన్‌ సాయంతో కారును బయటకు తీశారు. అమరేందర్ రావు జగిత్యాలలో న్యాయవాదిగా పనిచేస్తారని స్థానికులు తెలిపారు. బయటపడ్డ జయంత్ మాట్లాడేందుకు నిరాకరించారు. 

చదవండి: వరంగల్‌: కాలువలోకి దూసుకెళ్లిన కారు

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top